Kidney Stones: కిడ్నీలో రాళ్లు.. ప్రపంచవ్యాప్తంగా పది శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.. అది భారతదేశంలో 73 ఏళ్ల ప్రజలు కిడ్నీలో రాళ్లు సమస్యతో సతమతమవుతున్నారు.. ఈ సమస్య ఎక్కువగా 20 నుండి 55 సంవత్సరాల మధ్య వయసు వారిలో కనిపిస్తుంది.. ఈ సమస్య స్త్రీలలో కంటే పురుషులలో మూడు రెట్లు అధికంగా ఉంది.. చిన్న పిల్లలలో అరుదుగా కనిపిస్తుంది.. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!
Kidney Stones: ఈ లక్షణాలు ఉంటే కిడ్నీ లో రాళ్ళు ఉన్నట్టా..!?
నేటి ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మరికొన్ని ఇతర కారణాల వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. అయితే చాలా మంది పాలకూర టమాటా కలిపి వండుకుని తినడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి అని అనుకుంటారు. అయితే ఇది అపోహ మాత్రమే అని వైద్యులు నిర్ధారించారు. కిడ్నీలో రాళ్లు ఉంటే విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. వీటితో పాటు వాంతులు, వికారం గా అనిపిస్తుంది.
మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. నడుము నొప్పి గా ఉంటే ఆ శ్రద్ధ వహించకండి. ముఖ్యంగా ఒక వైపు నడుము నొప్పి ఉంటే అది మాత్రం కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు సంకేతమని గుర్తించండి. కొంత మంది లో మూత్రం లో మంట, మూత్రంలో రక్తం, చీము కూడా వస్తాయి. కొన్ని సార్లు ఎటువంటి లక్షణాలు, నొప్పి లేకుండానే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
ఈ సమస్య పురుషులలో ఎక్కువగా ఉంటుంది. గౌట్ సమస్య ఉన్న వారిలో, కీమో థెరపీ చేయించుకున్న వారిలో కిడ్నీలో స్టోన్స్ ఎక్కువగా ఏర్పడతాయి. వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వస్తుంది. పైన చెప్పుకున్న లక్షణాలలో మీకు ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవటం మంచిది.