Sugar Control: ఈ రోజుల్లో లో చిన్న పెద్ద వయసు భేదం తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య మధుమేహం.. చాలామంది దీనిని వ్యాధి గా భావిస్తారు.. అయితే ఆరోగ్య నిపుణులు దీనిని సమస్యగానే చూడాలి కానీ, వ్యాధిగా పరిగణించవద్దు అని తెలుపుతున్నారు. రక్తం లో ఉన్న గ్లూకోజ్ స్థాయిల హెచ్చుతగ్గుల వలన డయాబెటిస్ వస్తుంది.. మధుమేహం కంట్రోల్లో ఉంచకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. ఆయుర్వేదంలో మధుమేహానికి చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి..!! అలాగే డయాబెటిస్ తో బాధపడేవారు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం..!!
Sugar Control: డయాబెటిస్ కి చెక్ పెట్టే అద్భుతమైన చిట్కా..!!
కావాల్సిన పదార్ధాలు:
మర్రి చెక్క 100 గ్రాములు, రావి చెక్క 100 గ్రాములు, నేరేడు చెక్క 100 గ్రాములు, పొగడ చెక్క 100 గ్రాములు, మేడి చెక్క 100 గ్రాములు, మామిడి చెక్క 100 గ్రాములు, లోద్దుగ చెక్క 100 గ్రాములు, అశోక చెక్క 100 గ్రాములు, తుమ్మ చెక్క 100 గ్రాములు, చండ్ర చెక్క 100 గ్రాములు.పైన చెప్పుకున్న అన్ని మొక్కల బెరడుల సేకరించి వాటిని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇలా అన్ని రకాల పొడులను సరైన మోతాదులో తీసుకొని కలుపుకోవాలి.
ఇలా తయారుచేసుకున్న పొడిని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఒక బాండి ని తీసుకొని ఇలా తయారు చేసుకున్న పొడిని మూడు చెంచాలు తీసుకొని అందులో లో 2 గ్లాసుల నీరు పోయాలి. దీనిని ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున, రాత్రి భోజనానికి ముందు తాగాలి. ప్రతిరోజు ఇలా తాగడం వలన షుగర్ నియంత్రణలోకి వస్తుంది. షుగర్ వలన బాధపెట్టే అనేక రకాల ఇన్ఫెక్షన్లకు ఈ కషాయం అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా శృంగార శక్తి పెరుగుతుంది. చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
Sugar Control: షుగర్ తో బాధపడేవారు ఎక్కువగా తినకూడని పదార్థాలు..!!
డయాబెటిస్ తో బాధపడేవారు క్యారెట్, ముల్లంగి, బీట్ రూట్ తినవచ్చు.. ఈ మూడు రకాల దుంపలు తప్ప మిగతా అన్ని రకాల దుంపలు తీసుకోకూడదు.. తీపి పదార్థాలు అస్సలు తినకూడదు. తెల్ల బియ్యం అన్నం కూడా ప్రతిరోజు తినకూడదు. తెల్ల బియ్యం బదులు దంపుడు బియ్యం, సిరి ధాన్యాలు తీసుకోవడం మంచిది. తియ్యగా ఉండే పండ్లు, కూల్ డ్రింక్స్, బయట దొరికే చిరుతిళ్లు తినకూడదు. వంకాయ, పచ్చి మిరపకాయలు, క్యాలీఫ్లవర్ మీ డైట్ లో ఎక్కువగా తీసుకోకూడదు. గోధుమలు కూడా ఎక్కువగా తినకూడదు. ఇందులో ఉండే గ్లూటెన్ షుగర్ లెవెల్స్ పెరిగేలా చేస్తుంది.
మీ ఆహారంలో కచ్చితంగా సిరిధాన్యాల ను తీసుకోండి. వీళ్ళు అన్ని రకాల పండ్లను కూడా తినకూడదు. ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్ మధుమేహం ఉన్న వారు అసలు తాగకూడదు. బ్రెడ్ ఎక్కువగా తినకూడదు.. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ జోలికి వెళ్ళకూడదు. పచ్చళ్ళు కూడా తినటం తగ్గించాలి. వేపుళ్ళు ఫ్రై చేసిన ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిది ఇవి తినకుండా ఉంటూ పైన తెలిపిన చిట్కాలు పాటిస్తే డయాబెటిస్ త్వరగా అదుపులోకి వస్తుంది చిట్కా 100 శాతం ఫలితాలు అన్న సంగతి మర్చిపోవద్దు. అలాగే ప్రతి రోజు ఒక గంట వాకింగ్ చేయడం కూడా మంచిది.