ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ సిటీకి చెందిన ,అనిల్ అనే వ్యక్తి సోషల్ వర్కర్, ప్రాపర్టీ డీలర్ అయిన లలిత ప్రసాద్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. లాక్ డౌన్ దేశ వ్యాప్తంగా ప్రకటించడంతో, చాలామంది కటిక పేద వాళ్ళు తినడానికి తిండి లేక రోడ్లపైనే తమ జీవితాన్ని ఈడ్చుకోస్తున్నారు. అయితే ఇలాంటి వారిని ఆదుకునేందుకు చాలామంది ఆహార పొట్లాలను మంచినీళ్ల బాటిళ్లను అందిస్తున్నారు.
డ్రైవర్ అనిల్ కూడా కాన్పూర్ సిటీ లో ఆకలితో అలమటిస్తున్న పేదవారికి ఆహార పొట్లాలను పంపిణీ చేయడం ప్రారంభించాడు.
ఆ క్రమంలోనే నీలం అనే ఒక అమ్మాయిని అనిల్ చూసి బాగా ఇష్టపడ్డాడు. తదనంతరం ఆ అమ్మాయి తో మాట్లాడడం ప్రారంభించాడు.
. అప్పటినుండి అనిల్ ఆమె కోసం తానే స్వయంగా వంట చేసి రెండుపూటలా ఆహార పొట్లాలను అందించేవాడు. కాలక్రమేణా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
ఈ విషయం లలిత ప్రసాద్ కి తెలియడంతో యాచకురాలు అయిన నీలం గురించి అన్ని విషయాలు ఆరా తీయగా… ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారని… మావయ్య కూడా ఆ అమ్మాయిని వదిలేశాడని తెలిసింది.
ఆ క్రమంలోనే నీలం అనే ఒక అమ్మాయిని అనిల్ చూసి బాగా ఇష్టపడ్డాడు. తదనంతరం ఆ అమ్మాయి తో మాట్లాడడం ప్రారంభించాడు.
. అప్పటినుండి అనిల్ ఆమె కోసం తానే స్వయంగా వంట చేసి రెండుపూటలా ఆహార పొట్లాలను అందించేవాడు. కాలక్రమేణా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
ఈ విషయం లలిత ప్రసాద్ కి తెలియడంతో యాచకురాలు అయిన నీలం గురించి అన్ని విషయాలు ఆరా తీయగా… ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారని… మావయ్య కూడా ఆ అమ్మాయిని వదిలేశాడని తెలిసింది.
ఆ తర్వాత లలిత ప్రసాద్ అనిల్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఒప్పించి నీలం తో కూడా ఇష్టాయిష్టాలు తెలుసుకుని ,వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. ప్రస్తుతం ఈ నూతన దంపతులు ఎంతో అన్యోన్యంగా, సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారని యజమాని లలిత ప్రసాద్ చెప్పుకొచ్చారు.