Digestion: మనం తీసుకునే ఆహారం తోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది.. కొన్ని కొన్ని సార్లు మనకి తెలియకుండానే రుచికరమైన భోజనం కనిపించగానే ఎక్కువగా తినేస్తుంటారు.. తిన్న తర్వాత కలిగే అసంతృప్తి వర్ణనాతీతం..!! భారీగా తిన్న భోజనం తర్వాత అరయించుకోవడానికి కాస్త సమయం పడుతుంది.. ఈ లోపు ఉదర సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి.. అయితే మీరు తిన్న తరువాత ఈ సింపుల్ చిట్కాలు పాటించండి చాలు..!!
బెల్లం, నెయ్యి, మెంతుల పిండి కలిపి మెంతి లడ్డు తయారు చేసుకోవాలి. ఉదయం అల్పాహారం తిన్న తరువాత మెంతి లడ్డూ ను ఒకటి తినాలి. ప్రతిరోజూ ఇలా తినటం వలన జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్తిని వంటి సమస్యలను తగ్గిస్తుంది. భోజనంలో చిన్న ఫుడ్ ఎక్కువగా తినేసారా అయితే వెంటనే లడ్డు ఒకటి తినండి. లేదంటే ఒక గ్లాస్ మజ్జిగలో చిటికెడు నల్ల ఉప్పు, ఇంగువ కలిపి తాగండి. వెంటనే ఉపశమనం లభిస్తుంది.
మీరు మనం తీసుకున్న తర్వాత కడుపు ఇబ్బందికి గురి అయినట్లు అనిపిస్తే వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగండి ముఖ్యంగా నూనె వస్తువులు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ చిట్కా ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే రాత్రి నిద్ర కు ముందు ఒక గ్లాసు పాలలో ఒక టీ స్పూన్ చ్యవన్ ప్రాశ్ కలుపుకుని తాగాలి. ఇప్పుడు చెప్పకున్న చిట్కాలు ప్రయత్నిస్తే భారీ భోజనం తిన్న తర్వాత కలిగే అసంతృప్తిని తగ్గిస్తుంది.