బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో వివాదాలు లేక వినోదాలతో ముందుకు వెళుతోంది. శనివారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు బిగ్బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఒప్పో ఫోన్ తో సభ్యులు గ్రూపులుగా ఏర్పడి ఫోటో షూట్ చేయాల్సి ఉందని చెప్పారు. ఫోటోగ్రాఫర్ ఎవరన్నది ఇంటి సభ్యులే నిర్ణయించుకోవాలని బిగ్బాస్ చెప్పారు. ఉత్తమ ఫోటోలను బిగ్ బాస్ నిర్ణయిస్తారని సభ్యులకు చెప్పగా…. ఫోన్ ను, టీ షర్ట్ లను ఇంటి సభ్యులకి అందించారు. ఈ ఫోటో షూట్ కు సంబంధించిన విషయంలోకి వెళితే ఫోటోషూట్ టాస్క్ లో మెహబూబ్, దివి అరబ్ దంపతులుగా వేషధారణలతో ఉన్న స్టిల్స్ కి అమ్మా రాజశేఖర్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ ఫోటోకు మొదటి ప్రైజ్ వచ్చింది.
దీంతో అందరూ అమ్మా ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆ తర్వాత కుమార్ సాయి, అరియానా గ్లోరీ జంటకి దేవి నాగవల్లి జట్టు ఫోటోషూట్ నిర్వహించారు. కుమార్ బిచ్చగాడు గా నటించగా అతనికి జంటగా నటించిన అరియానా కు దేవి ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించారు. రోడ్డుపై బిచ్చగాడిగా కుమార్ స్థాయి ఉన్న ఫోటో అందరినీ ఆకట్టుకుంది. ఇంటి సభ్యులు అంతా ఆ ఫోటోకి ప్రశంసలు అందించారు. నాగవల్లి ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది అనే మాట వినిపించింది. ఇక ఫోటో కి తగినట్లు కుమార్ సాయి చూపించిన ఎక్స్ప్రెషన్స్ మరింత అందం ఫోటోకి తెచ్చిపెట్టింది అని చెప్పాలి.
అందరికన్నా చెప్పుకోవాల్సింది అభిజిత్, మోనాల్ రొమాన్స్ గురించి. ప్రేమపక్షులు గా వీరిద్దరూ నటించారు. ఫోటోగ్రాఫర్ గా అఖిల్ సార్దక్ వ్యవహరించడం విశేషం. ఈ జంట ఉన్న ఫోటోలను కొత్త సినిమా పోస్టర్లలా ఉన్నాయి అంటూ ప్రశ్నలు కురిపించారు. నిజమైన ప్రేమికులు గా వీరిద్దరూ కనిపించగా మోబాల్ అభిజిత్ పై ముద్దుల వర్షం కురిపించారు. వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది.
ఇక హారిక, సుజాత పచ్చని వాతావరణంలో ఫ్రెండ్స్ గా కనిపించారు. ఇక వీటన్నింటిలో మెహబూబ్-దివి లకి మొదటి ప్రైజ్ రావడం ఆడియన్స్ కు కూడా సబబుగానే అనిపించింది. కానీ అభిజిత్ తో మోనాల్ తో రొమాన్స్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ తంతు మొత్తం ‘బిగ్ బాస్ అన్ సీన్’ ఎపిసోడ్ లో జరగడం విశేషం. అయితే ఇక ప్రేక్షకులు ఎవరు చూడకుండానే మోనాల్ ఇలా ముద్దుల వర్షం కురిపించడం తో మరో వారం బిగ్ బాస్ ప్రేమకథ చుట్టూ తిప్పుతారు అనడంలో సందేహంలేదు.