బిగ్ బాస్ షో మొదట్లో కాస్త డల్ అయినట్లు కనిపించినా రోజులు గడుస్తున్న కొద్దీ బాగానే పుంజుకుంది. నాగార్జున శనివారం ఎపిసోడ్ కు వచ్చాడంటే మాత్రం అసలు షో కు ఎక్కడ లేని ఊపు వస్తుంది. ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో నిర్వాహకులు కొత్త పద్ధతులను ఫాలో అవుతున్నారు. అసలు ఎవరికీ అర్థం కాని రీతిలో ట్విస్టులు థ్రిల్లర్ సినిమా ను తలపిస్తున్నాయి.
నిన్న స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. తీరా చూస్తే తనకు కనీసం ఫాన్స్ ఎవరు లేరని గుర్తుకు వచ్చి అవును కదా అనుకున్నారు. అదే బిగ్ బాస్ స్పెషాలిటీ. మరోవైపు నాగార్జున ఉత్సాహంగా వారిపై జోక్స్, సెటైర్స్ వేస్తూ ఉన్నాడు. తాజాగా అవినాష్ ని ఒక ఆట ఆడుకున్నాడు.
సీసీ కెమెరాల్లో నువ్వు చేసే ప్రతీది తెలిసిపోతుందని అవినాష్ నాగార్జున చెప్పాడు. నువ్వు ఏం రాశావో చెప్పాల్సిందేనని నాగార్జున గట్టిగా ఆరా తీయడంతో అవినాష్ ఆందోళన చెందాడు. అయ్యో అలాంటిదేమీ లేదు సార్ అంటూ ముగించాడు. ఇంతలో నాగార్జున నువ్వు ఐ లవ్ యూ అని రాసావు అని తెలిసింది అని అన్నాడు. నువ్వు చేసిందంతా వీడియో లో బయట పెట్టమంటావా అని అడిగాడు.
సార్ నా కొంప ముంచకండి అలాంటిది ఏమీ లేదు అని అవినాష్ చెప్పాడు. నాగార్జున నిజంగానే ఏమీ లేదా అని అడిగితే మీరు ఇలా మాట్లాడితే నాకు ఎవరూ పిల్లను కూడా ఇవ్వరు సార్ అని అన్నాడు. అవినాష్ కు పిల్లను ఇచ్చేవారు ఇంట్లో అతను చేసే పనులను ఒకసారి గమనించండి అని నాగార్జున చెప్పడంతో అవినాష్ లబోదిబో మన్నాడు. ఇక అరియానా గ్లోరీ కూడా నాకు అవినాష్ కు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పడంతో జస్ట్ జోక్ చేశాను అని నాగార్జున ఒక్కసారిగా అందరి వేడి తగ్గించే చేశాడు