బిగ్ బాస్ హౌస్ నాలుగవ సీజన్ రసవత్తరంగా జరుగుతోంది. కిల్లింగ్ కాయిన్స్ పాయింట్స్ టాస్క్ 24వ రోజు కూడా కొనసాగింది. అయితే ఎక్కువ కాయిన్స్ సొంతం చేసుకోవడానికి ఇంటి సభ్యులు ఎత్తుకు పై ఎత్తు వేయటం మొదలుపెట్టారు. మెహబూబ్, సోహైల్ సభ్యులు నిద్ర పోయినప్పుడు కాయిన్స్ దొంగిలించే ప్రయత్నం చేశారు. అలా తమ కాయిన్స్ దొంగలించడం పై ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో రాజశేఖర్ మాస్టర్, సోహైల్ ల మధ్య గొడవ కూడా గట్టిగానే జరిగింది. ఈ మాటల యుద్ధం అయిపోయిన తర్వాత చివరిగా అమ్మరాజశేఖర్ సోహెల్ పై తీవ్రంగా మండిపడ్డాడు. కాయిన్స్ దొంగలించిన నువ్వు గేమ్ ఎలా గెలుస్తావో నేను కూడా చూస్తాను అని అన్నాడు. ఇంత కష్టపడి మేము కాయిన్స్ సంపాదిస్తే మీరు సులువుగా కొట్టేస్తారా…? మనస్సాక్షి లేకుండా ఆడుతున్నారు అంటూ రాజశేఖర్ శాపనార్థాలు పెట్టాడు.
ఇక ఇదే సమయంలో కిల్లింగ్ కాయిన్స్ ఆడుతున్న ముక్కు అవినాష్ ఆట మధ్యలో కిందపడిపోయాడు. అవినాష్ కు గాయం కావడంతో ఇంత సభ్యులందరికీ తక్షణమే చికిత్స అందించాలని బిగ్బాస్ కు సూచించారు. ఆ తర్వాత అవినాష్ మెడికల్ రూమ్ కి తీసుకుని వెళ్లాడు. ప్రస్తుతానికి రెండో లెవల్ టాస్క్ కొనసాగుతోంది. అవినాష్ గాయం తీవ్రత పై ఎలాంటి సమాచారం లేదు. ఇదే క్రమంలో మొనాల్ తీవ్ర మనస్తాపానికి గురైంది. బాత్రూంలోకి వెళ్లి తనకు తాను ఏడుస్తూ తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేసింది. తనను ఉద్దేశించి మాస్టర్ రాజశేఖర్ కామెంట్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.