ఇప్పటికే బిగ్ బాస్ 4 కి సంబంధించి పాల్గొనబోయే కంటెస్టెంట్స్ విషయంలో టీం దాదాపుగా అందరినీ ఫైనలైజ్ చేసేసిందని విషయం బయటికి వచ్చేసింది. అంతేకాకుండా సెలబ్రిటీస్ అందరినీ టీమ్ పర్సనల్గా తమ సముఖత వ్యక్తం చేయమని కోరిందట. ఇక నాలుగవ సీజన్ గ్రాండ్ గా చేసేందుకు బిగ్ బాస్ వారు సన్నాహాలు చేస్తుండగా ఈ విషయమై ఇంకా వారు పూర్తిస్తాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ముందుగా బిగ్ బాస్-3 కి హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున తర్వాత సీజన్ కు కూడా కొనసాగుతారని వార్తలు వచ్చాయి. అయితే అతని స్థానంలో అతని కోడలు అక్కినేని సమంత పేరు కొద్దిరోజులు వినిపించినా… తర్వాత చివరికి నాగార్జున కే నిర్వాహకులు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. అయితే నాగార్జున మాత్రం కరోనా నేపథ్యంలో వారి ఆఫర్ ను పెండింగ్ లో పెట్టాడట.
అక్కినేని నాగార్జున బిగ్ బాస్ వారి ఆఫర్ ను పూర్తిగా తిరస్కరించకపోయినా కొద్దిగా సంశయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే స్టార్ మా యొక్క ఓనర్ అయిన డిస్నీ గ్రూప్ కూడా బిగ్ బాస్ సెట్స్ లో మరియు స్టేజి పైన చాలా కచ్చితత్వంతో లాక్ డౌన్ రూల్స్ పాటించాలని మరియు కరోనా వైరస్ సంక్రమించేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని సూచించినట్లు సమాచారం.
అయితే ఇటువంటి పరిస్థితుల్లో అనేక అడ్డంకులు మరియు పరిమిరుల నడుమ ఈ సీజన్ బిగ్ బాస్ మొదలవుతుందా.. ఒకవేళ మొదలైనా నడుస్తుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే నాగార్జున తర్వాత చిత్రమైన ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కూడా నిలిపివేశారు. ఇక ఈ నెల ఆఖరి వరకు ఆగితే ఏది ఎలా జరగబోతోంది మరియు ఈ టాల్ రేట్డ్ రియాల్టీ షోలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అన్న దాని పై స్పష్టత వస్తుంది.