బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఫైనలిస్టు ల కన్నా చాలా ముందు ఎలిమినేట్ అయిపోయిన సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యా ఆ కొద్ది రోజుల్లోనే ఎంతో క్రేజ్ సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈమెకు అప్పుడే ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో బిగ్బాస్ లో తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయటపె
ట్టింది దివి. మహేష్ మహర్షి చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించి మెప్పించిన ఆమె ఆ తర్వాత తన అందంతో తెలుగు బిగ్ బాస్ లో ప్రేక్షకులను సంపాదించింది.
మంచి ఆటతీరు తో ఎంత మంది అభిమానాన్ని దక్కించుకుంది. నిజాయితీగా ఉండడం, నిర్భయంగా మాట్లాడడం ఈమెకు ఉన్న మంచి లక్షణాలు. షో మధ్యలోనే బయటకు వచ్చినప్పుడు కూడా అందరూ దివి ను సమర్థించారు. కావాలని ఆమెను ఎలిమినేట్ చేశారని విమర్శలు గుప్పించారు. తర్వాత చిరంజీవి కూడా గ్రాండ్ ఫినాలే లో తన సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ ఉన్నట్లు చెప్పాడు.
అయితే ఆమెకు అన్నీ ఇచ్చిన బిగ్ బాస్ హౌస్ లో తనకు జరిగిన ఒక చేదు అనుభవాన్ని బయటపెట్టింది. స్వాతి దీక్షిత్ ఇంట్లో ఉన్నప్పుడు చూసుకోకుండా గ్లాస్ కు గుద్దుకుంది. అప్పుడు ఆమె ముఖానికి మేకప్ దానిని అంటుకుంటే అది చూసి నేను దెయ్యం అని భయంతో కింద పడి పోయాను అని చెప్పింది. అది చూసిన తర్వాత చాలా సేపు ఏడుస్తూనే ఉన్నాను… డాక్టర్ కావాలని బిగ్బాస్ ను అడగడంతో నన్ను లోపలికి పిలిచారు. ఆ భయంతో నాకు వాంతులు కూడా అయ్యాయి అని చెప్పింది. ఇక అప్పటి నుండి ఒక రోజు మొత్తం అక్కడే ఉన్నట్లు దీంతో నేను ఎలిమినేట్ అయ్యారు అని అనుకున్నారు అని తెలిపింది. ఇక ఇదే మీకు చూపించలేదు అని షాక్ ఇచ్చింది.
ఇక ఇంత జరిగినప్పటికీ బిగ్బాస్ నిర్వాహకులు ఆ క్లిప్పింగ్ ను టెలికాస్ట్ చేయలేదు అంటే అర్థం ఏమిటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అది చూపించి ఉంటే ఆమె పై ఏదైనా సింపతీ వచ్చేదని… ఎలిమినేట్ చేసేందుకు కష్టం అవుతుందని కావాలని ఎడిటింగ్లో తీసేశారు అని మరికొందరు వాదిస్తున్నారు.