వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు నాలుగవ సీజన్ 5 వారం ఎలిమినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా మారబోతోంది. ప్రస్తుత ఈ వారం తొమ్మిది మంది కంటెస్టెంట్ లు ఎలిమినేషన్ లో నిలవడంతో కచ్చితంగా డబల్ ఎలిమినేషన్ ఉంటుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంట్లో నుండి ఈ వారం బయటికి వెళ్ళేందుకు ఎవర్వరు నామినేట్ అయ్యారు అనే విషయానికి వచ్చినట్లయితే…. ముందుగా ఎలిమినేషన్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
అభిజిత్, అఖిల్, యాంకర్ లాస్య, సోహెల్, మోనాల్ గజ్జర్, హారిక, అరియానా, అమ్మ రాజశేఖర్, జోర్దార్ సుజాత ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. తాజా వార్తల ప్రకారం బిగ్ బాస్ లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ప్రసక్తే లేదని స్పష్టం అవుతోంది. టాస్క్ ల విషయంలో కొందరు పర్ఫార్మెన్స్ పట్ల ప్రేక్షకుల్లో నిరుత్సాహం నెలకొంది.
కాబట్టి నాగార్జున కూడా నామినేషన్ ప్రక్రియ సందర్భంలో జరిగిన రచ్చ గురించి కొద్ది సేపు అందరినీ మందలించి…. ఆ తరువాత వెళ్లేముందు ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండవచ్చు అని వారిలో భయం నింపి వెళ్ళిపోతారు అని వార్తలు బయటకు వచ్చాయి.
ఇక శుక్రవారం రాత్రి వరకు జరిగిన ఓటింగ్ ప్రకారం అత్యధిక ఓట్లతో… దాదాపు 30 శాతం ఓట్లతో అభిజిత్ మొదటి స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో అఖిల్ 10 నుంచి 20 శాతం ఓట్లను సాధించాడని తెలుస్తోంది. ఇక అందరికన్నా తక్కువ ఓటింగ్ తో లిస్టులో సుజాత, మోనాల్, అమ్మా రాజశేఖర్ ఉన్నారని స్పష్టం అవుతోంది. వీరి ముగ్గురిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నారు.