బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో ఈ వారం కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ ప్రక్రియ మొదలుకొని టాస్క్ నుండి ఎలిమినేషన్ వరకు ఏ ఒక్క ఎపిసోడ్ కూడా అంచనాలకు తగ్గలేదు. అయితే వీటన్నింటిలో వారాంతంలో గంగవ్వ ఇంటి నుండి బయటకు వెళ్లిపోవడం…. నాగార్జున శనివారం కంటెస్టెంట్స్ అందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేయడం గమనార్హం.
వీటన్నిటి మధ్య అసలు ఈరోజు ఇంటి నుండి బయటికి వెళ్లి కంటెస్టెంట్ ఎవరు అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఏకంగా తొమ్మిది మంది నామినేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే వారందరిలో అభిజిత్ అత్యధికంగా 30 శాతం ఓట్లను సాధిస్తే అఖిల్ 10 నుంచి 20 శాతం ఓట్లు కొల్లగొట్టాడు. ఇక చివరి స్థానాల్లో మోనాల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్ ఉన్నారు. వీరి ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్ళి పోతారు అన్న చర్చ జరుగుతోంది.
అయితే బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈవారం ఇంటి నుండి వెళ్ళిపోయి కంటెస్టెంట్ జోర్దార్ సుజాత అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ నుండి వదిలి వెళ్లిపోయిందని చెబుతున్నారు. నామినేట్ అయిన మిగతా కంటెస్టెంట్ లతో పోలిస్తే సుజాత అడపాదడపా కొన్ని టాస్క్ లలో నోరు లేవనెత్తింది కానీ ఆమెకు ఇంటిలో పెద్దగా ప్రాముఖ్యత లేదు అనే చెప్పాలి. ఇక ప్రేక్షకులదే అంతిమ నిర్ణయం కాబట్టి సుజాత మళ్లీ ఇంట్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చే అవకాశాలు కూడా దాదాపు లేనట్లే అంటున్నారు.