Bigg Boss Non Stop: తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్.. ఓటీటీలోకి కూడా అడుగుపెట్టింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా బిగ్బాస్ నాన్స్టాప్ పేరుతో 24/7 ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. గత కొద్ది రోజుల నుంచీ రసవత్తరంగా సాగుతున్న ఈ షో.. ఇప్పుడు ఆఖరి వారానికి చేరుకుంది.
17 మందితో ఈ షో ప్రారంభం కాగా.. మధ్యలో ఓ వైల్డ్కార్డ్ ఎంట్రీతో కంటెస్టెంట్ల సంఖ్య మొత్తం 18కి చేరుకుంది. అయితే ప్రస్తుతం హౌస్లో ఏడుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. అనిల్, బిందు, అఖిల్, బాబా భాస్కర్, మిత్ర, శివ, అరియానా ఫినాలే వీక్లో అడుగుపెట్టారు. వీరిలో టైటిల్ ఎవరి సొంతం అవుతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం హౌస్లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్లో అఖిల్ సార్థక్, బిందుమాధవి, యాంకర్ శివ మధ్యనే టఫ్ ఫైట్ నడుస్తోంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం.. బిగ్బాస్ ఓటీటీ విన్నర్గా బిందు మాధవినే నిలిచిందట. అఖిల్, శివల కంటే ఎక్కువ ఓట్లు రాబట్టడంతో ఆమెనే బిగ్ బాస్ నాన్ స్టాప్ ట్రోఫీ అందుకోబోతోందని జోరుగా వార్తలు వస్తున్నాయి.
దీంతో తెలుగు బిగ్బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఒక అమ్మాయి గెలిచిందంటూ బిందు మాధవి అభిమానులు సోషల్ మీడియా వేదికగా సందడి షురూ చేశారు. ఇక బిగ్బాస్ సీజన్ 4 రన్నర్గా నిలిచిన అఖిల్.. ఇప్పుడు మళ్లీ రన్నర్గా నిలిచాడని తెలుస్తోంది.