Bigg Boss 5 Telugu: మహమ్మారి కరోనా వైరస్ ఎవరిని విడిచి పెట్టడం లేదు. దేశవ్యాప్తంగా వారాల వ్యవధిలో ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి. ఢిల్లీ మొదలుకొని గల్లీ వరకు సామాన్యులు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సినిమా హీరోలు మొత్తం కరోనా బారిన పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు, చిరంజీవి, కీర్తి సురేష్.. ఇంకా చాలా మంది నటీనటులు హీరోలు కరోనా బారిన పడటం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి చెందిన కంటెస్టెంట్ లు ఇటీవల వరుస పెట్టి… కరోనా బారిన పడుతున్నారు. మొన్న సిరి,.. ఆ తరువాత యానీ మాస్టర్.. కాగా తాజాగా ఇప్పుడు సమీరా కరోనా బారిన పడటం జరిగింది. సీజన్ ఫైవ్ లో దాదాపు వంద రోజులు ఉండాలి అని తన కోరిక అంటూ కాన్ఫిడెంట్ గా మాట్లాడిన సమీరా.. మొదటివారంలోనే హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. చాలా విషయాలలో నోరు జారడం తోపాటు… అనేక మంది ఆమెను టార్గెట్ చేయడం తో… వారం రోజులకే సరియు బిగ్ బాస్ హౌస్ నుండి దుకాణం సర్దేసింది.
సోషల్ మీడియాలో పచ్చిగా బూతులు మాట్లాడుతూ సెలబ్రిటీగా మారిన సరియు… అందాలు చూపించడంలో ఎక్కడా హద్దులు లేకుండా తెలుగు కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇటీవల ఆమె కరోనా బారిన పడటం జరిగింది. స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేయడంతో ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. సీజన్ ఫైవ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఇటీవల “స్టార్ మా” ఇంకా కొన్ని చానల్స్ లో పలు షోలలో పాల్గొనడం జరిగింది. అదే సమయంలో ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లు వరుసపెట్టి కరోనా బారిన పడుతూ ఉన్నారు.