Bigg Boss 6: వరల్డ్ లార్జెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ వివాదం తెలుగు రాష్ట్రాలలో ఇంకా నడుస్తున్న సంగతి తెలిసిందే. సెన్సార్ లేకుండా నేరుగా షో ప్రసారం చేస్తున్నారని.. అస్లీలం ఇంకా హింస అసభ్యకరమైన కంటెంట్ ప్రోత్సహించే విధంగా ఉందని కొద్ది రోజుల క్రితం నిర్మాత మరియు సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టు లో పిల్ దాఖలు చేయడం జరిగింది. ఆ టైంలో చేపట్టిన విచారణ పై తాజాగా మంగళవారం నాడు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బిగ్ బాస్ కేసు పరిష్కరించక ముందు.. ఈ షో మేం కూడా చూస్తామని ఒకటి రెండుసార్లు పరిసరించేందుకు కొన్ని ఎపిసోడ్లు చూస్తామని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
దీంతో తమకంటూ ఒక అవగాహన వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాదు ఈ రియాల్టీ షోలో పాల్గొనే మహిళ కంటెస్టెంట్ లకు ప్రెగ్నెన్సీ పరీక్షలు కూడా చేస్తున్నట్లు… ఇలాంటి కార్యక్రమాలను IBF గైడ్ లైన్స్ ప్రకారం రాత్రి 11 నుంచి 5 గంటలలోపు ప్రసారం చేయాలని పిటీషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇక ఇదే సమయంలో బిగ్ బాస్ షో కి సంబంధించి పూర్తి వివరాలు… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. తమకి అందించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఇక ఇదే సమయంలో పిటిషనర్ ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరగా.. అది ఇప్పుడే సాధ్యం కాదు అని తెలిపింది. అనంతరం తదుపరి విచారణ ఈనెల 27వ తారీకుకి హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికే ఈ షో ఆపేయాలని సమాజం పాడైపోతుంది అంటూ సిపిఐ నారాయణతో పాటు పలువురు రాజకీయ నాయకులు బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ షో పై విచారణ జరుగుతూ ఉండటంతో చివర ఆఖరికి న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చాలా ఉత్కంఠ బరీతంగా మారింది.