బిగ్ బాస్ నాలుగో సీజన్ లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని నాగార్జున క్రితం వారం ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఓవైపు ఐపీఎల్ ఎఫెక్ట్ వల్ల రేటింగ్ తగ్గే అవకాశం ఉందని బిగ్ బాస్ సరికొత్త నామినేషన్ ప్రక్రియతో మరింత హైప్ క్రియేట్ చేయనున్నాడు. ఈ సందర్భంలో కంటెస్టెంట్స్ చెట్టాపట్టాలేసుకొని సేఫ్ గా గేమ్ ఆడుతూ ఉంటే జనాలకు కూడా విసుగు రావడం మొదలైంది.
కాబట్టి మూడవ వారం నామినేషన్ ప్రక్రియ బిగ్బాస్ నిర్వాహకులు చాలా డిఫరెంట్ గా ఆలోచించి ఏర్పాటు చేశారు. ఏకంగా కంటెస్టెంట్ ఫోటోలను మంటల్లో వేసి నామినేట్ చేయాలని చెప్పడంతో ప్రతి ఒక్కరిలో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. కంటెస్టెంట్స్ మధ్య శత్రుత్వం కూడా పెరిగింది. అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక మూడవ వారంలో దేవి నాగవల్లి, కుమార్ సాయి, మెహబూబ్, హారిక నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది.
ఫోటోలను పడేస్తూ నామినేట్ చేయడం కచ్చితంగా సరి కొత్త వివాదాలకు దారితీస్తోంది. ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం కాకుండా నామినేషన్లు చేసుకోవడం మొదలెట్టేశారు. ఇక ఇదే వరుసలో ఈ వీక్ లో ఒకరిపై ఒకరు బాగా పగ పట్టేసుకున్నారు. అరియానా, మోనాల్ మధ్య మాటల యుద్ధం కూడా ఎక్కువవుతోంది. వార్నింగ్ లు ఇద్దరు పరస్పరం గట్టిగా ఇచ్చుకున్నారు. దేవి, అమ్మా రాజశేఖర్ ఒకరినొకరు నామినేట్ చేసుకోగా… మోనాల్ అయితే ఏకంగా తన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అమ్మ రాజశేఖర్, దేవి మధ్యలో కూడా బిగ్ బాస్ చిచ్చు పెట్టడం ప్రేక్షకులను ఇప్పుడు మరింత ఉత్సాహానికి గురిచేస్తోంది.