ఈ రోజుతో బిగ్బాస్ నాలుగవ సీజన్ ముగుస్తుంది. గత పదిహేను వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను విపరీతంగా అలరించిన ఈ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో కి ఈ రోజుతో తెరపడనుంది. ఇక ఫైనలిస్తులు గా అఖిల్, అభిజిత్, సోహెల్, హారిక, అరియానా గ్లోరీ ఉన్నారు. వీరందరిలో ఎవరు విజేతగా నిలుస్తారు ఎవరు రెండోస్థానంలో నిలుస్తారు ఇక ఏ ముగ్గురు ఫైనలిస్టు లుగా సరిపెట్టుకుంటారు అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరికొద్ది క్షణాల్లో గ్రాండ్ ఫినాలే ప్రారంభం అవుతుంది. అనిల్ రావిపూడి, ప్రణీత, మెహరీన్, థమన్ వంటి ఎంతోమంది సెలబ్రిటీల మధ్య ఇంట్లోనీ అందరి కంటెస్టెంట్ లు, ఫైనలిస్టుల తల్లిదండ్రులు కలిసి స్టేజి పైన హోస్ట్ నాగార్జునతో రచ్చ చేయనున్నారు. దాదాపు 4 గంటల పాటు ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో ఉండనుంది.
ఇక శుక్రవారం అర్ధరాత్రి తో ఓటింగ్ పోల్స్ మూసివేశారు. ఇప్పటివరకు అందరికన్నా ఎక్కువ ఓట్లు సాధించిన కంటెస్టెంట్ అభిజిత్ అని తెలుస్తోంది. ఇక అతని తర్వాత స్థానం ఎవరు అన్న విషయం పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ఏమిటంటే అఖిల్ రెండో స్థానంలో నిలిచాడు. విశేషం ఏమిటంటే షో మొదట్లోనే అఖిల్, అభి ఇద్దరూ మోనాల్ తో ప్రేమ వ్యవహారం నడిపారు.
ఇక వీరిద్దరే మొదటి రెండు స్థానాలు రావడం గమనార్హం. అంతేకాకుండా వీరిద్దరూ ఆద్యంతం నువ్వానేనా అన్నట్లు పోటీ పడ్డారు. ఇక చివరికి అభిజిత్ పైచేయి సాధించి టైటిల్ గెలుచుకుంటే అఖిల్ రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు అని తెలుస్తోంది.