జబర్దస్త్ వల్ల ఎంతో మంది కమెడియన్స్ జీవితాలు బాగు పడిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఆ షోను నిర్వహిస్తున్న మల్లెమాల ప్రొడక్షన్స్ పై అనేక నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సాధారణంగా టీవీ ఇండస్ట్రీలో అహంకారాలు ఉంటాయి. ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతుంటే ఓర్వలేని ఎంతమందిని దగ్గర నుండే చూస్తూనే ఉంటాం. వాటన్నింటిని తట్టుకొని నిలబడాలి అంటే అంతా సాధారణమైన విషయం కాదు.
ఇక ‘క్యాష్’, ‘మహిళలు మహారాణులు’ ‘ఢీ’ వంటి ఎన్నో షో లతో ఎంతగానో క్రేజ్ సంపాదించుకున్న మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఆ తర్వాత ‘జబర్దస్త్’ తో మరో స్థాయికి చేరుకుంది. ఎంతో మంది కమెడియన్స్ కు ఇండస్ట్రీలో ఈజీగా అడుగుపెట్టేందుకు ఒక మార్గాన్ని కల్పించింది. అయితే ఈ మధ్య కాలంలో ఆ షో నుండి నాగబాబు బయటకు రావడం.. కొంత మంది కమెడియన్స్ కూడా తెగతెంపులు చేసుకోవడం బాగా వైరల్ అయిన విషయం. ఇక ముక్కు అవినాష్ కూడా జబర్దస్త్ షో నుండి తీసుకొని బిగ్బాస్ షో లోకి రావడానికి చాలా తిప్పలు పడ్డాడట.
ఎందుకంటే జబర్దస్త్ యాజమాన్యం ప్రతి కమెడియన్ తో అగ్రిమెంట్ చేసుకుని ఉంటుంది. అందులో చేసిన వారు మరొక చోటికి వెళ్లాలంటే అగ్రిమెంట్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందట. మరో చోటికి వెళ్లాలంటే జబర్దస్త్ కు భారీ మొత్తంలో నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది అని అంటున్నారు. వారికి నచ్చకపోతే ఫ్రీగా వెళ్లిపోవచ్చు కానీ రేటింగ్ తో లాభాలు వస్తే మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టరట. మళ్ళీ జీతాలు పెంచుతారా అంటే అదీ ఉండదు. అందుకే చాలామంది జబర్దస్త్ ను వదిలి వేరే షో కి రావడానికి భయపరును అని అంటున్నారు.
అయితే ఇండస్ట్రీ వర్గాలు మరియు ఇతర బుల్లితెర ప్రముఖులు, షో ల గురించి అవగాహన ఉన్న వారు అలాంటిదేమీ లేదని మల్లెమాల వారు ఎంతో సంతోషంగా అవినాష్ ను బయటకు పంపించారని చెబుతున్నారు. అయితే బిగ్ బాస్ షోలో కి వెళ్తున్న అతనికి ఎటువంటి లింకు పెట్టకుండా మల్లెమాల పంపించేసి ఉంటుందా అంటే…. ఎవరికీ అది నమ్మడానికి మనసొప్పడం లేదు. జబర్దస్త్ యాజమాన్యానికి అగ్రిమెంట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించే అవినాష్ బయటకు వచ్చాడని అంటున్నారు
అందుకే అవినాష్ లేట్ గా లోపలికి వచ్చాడు అని…. లేకపోతే ముందుగా అందరితో పాటు ఉండేవాడు అని వార్తలు వస్తున్నాయి. ఆఖరి నిమిషంలో గంగవ్వ అవినాష్ స్థానంలో లోపలికి రావడానికి కూడా ఇదే కారణం అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో వేచి చూడాలి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!