బిగ్ బాస్ షో లో వరుసగా రెండవ సీజన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున నిన్న తన విశ్వరూపం చూపించాడు. ఐదవ వారంలో ఇంటిలో ఎన్నో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. వాటన్నింటిలో ముఖ్యమైన ఘట్టాలను ఒక్కొక్కటిగా గుర్తు చేస్తూ అందరికీ కోటింగ్ లు ఇవ్వడం మొదలు పెట్టేశారు.
వీరందరిలో అభిజిత్-అఖిల్ లకు నామినేషన్ ప్రక్రియ లో జరిగిన రచ్చ గురించి భారీగా తిట్లు పడ్డాయి. అయితే అందరిని ఒక్కో లెవెల్ లో ఆడుకున్న నాగార్జున మెహబూబ్ కు మాత్రం గట్టిగా ఇచ్చి పడేసాడు. బిబి హోటల్ టాస్క్ లో మెహబూబ్ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుచ్చ లేచిపోద్ది అంటూ ఇతర ఇంటి సభ్యుల పై ఒక రేంజ్ లో రెచ్చిపోయారు. అలాంటి మాటలు మాట్లాడవద్దు అంటూ అఖిల్ చెప్పినా కూడా వినలేదు.
ఇక నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో పుచ్చ పగిలిపోద్దా? ఎవరిది? అంటూ ఫైర్ అయ్యాడు. ఇంట్లో వారితో, మీ ఫ్రెండ్స్ తో ఇలాగే మాట్లాడతావా అని ప్రశ్నించాడు. ఇలా బయట హోటల్ లో నువ్వు మాట్లాడితే మెడ పట్టుకుని బయటికి గెంటి 100 కు ఫోన్ చేసి మోకాళ్ళ చిప్పలు విరగొడతారు అంటూ నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
మెహబూబ్ ఏమి మాట్లాడలేక ఇంకోసారి అలా జరగదని క్షమాపణలు చెప్పాడు. అయితే ఇంత జరిగిన తర్వాత మెహబూబ్ ఆగ్రహాన్ని తగ్గించేందుకు సోహెల్ ఒక ఒక ఫ్రెండ్ గా సలహా ఇచ్చిన తీరు బాగుందని నాగార్జున కితాబిచ్చాడు. సోహెల్ చెప్పిన తర్వాత మెహబూబ్ అఖిల్ ను క్షమాపణ అడగడం దానికి అఖిల్ బాగా రియాక్ట్ కావడం బాగుందని నాగార్జున మెచ్చుకున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!