నాలుగవ సీజన్ బిగ్ బాస్ మూడవ వారం ఆట చాలా ఆసక్తిగా సాగుతుంది. హౌస్ లో అనేక తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరుగుతున్న ఫిజికల్ టాస్క్ లో రోబో టీమ్ తమకు అవసరమైన చార్జింగ్ ను మనుషుల ఇవ్వకపోవడంతో అదిరిపోయే ప్లాన్ వేశారు. మనుషుల టీం కు చెందిన దివి ని కిడ్నాప్ చేసి తమ ఇంట్లో పెట్టేసుకొని తలుపులు బంధించి ఆమె దగ్గర బలవంతంగా అందరూ ఛార్జింగ్ పెట్టుకున్నట్లు ప్రోమో లో బయటపడింది. దీంతో మనిషుల టీమ్ అసలు ఉండబట్టలేకపోయింది.
ఏం జరిగిందో గ్రహించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంతే ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ ఆకాశానికి ఎగిసిపడ్డాయి. వారి కోపం, బాధ, నిరుత్సాహం, నిట్టూర్పు, ఉద్రేకం మొత్తం ఒక్క నిమిషం ప్రోమో లోనే బయటపడింది. ఇక సోహెల్ అయితే అసలు ఉండబట్టలేకపోయాడు. అతను హౌస్ లో కెమెరాల మధ్య ఉన్నాడనే కానీ లేకపోతే ఎంతటి విధ్వంసం సృష్టించే వాడో ప్రేక్షకులకు అర్థం అయింది. కుమార్ స్థాయి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటే…. సోహెల్ మాత్రం…. “మీకసలు సిగ్గుందా రా..? అంటూ తిట్టడం మొదలు పెట్టాడు ..!” తన సొంత టీం సభ్యులను కూడా అతను విరుచుకుపడ్డాడు.
అలాగే తాజాగా సాయంత్రం విడుదల చేసిన ప్రోమోలో అయితే కుమార్ సాయి తో నువ్వు మర్యాదగా ఇప్పుడు తలుపు తీస్తే బాగుంటది లేదా బయటికి వచ్చిన తర్వాత కథ వేరే లాగా ఉంటుంది అని బెదిరించడం మొదలుపెట్టాడు. మొత్తానికి దివి కిడ్నాప్ తో సోహెల్ బాగానే హర్ట్ అయ్యాడు. ఇక బయటికి వచ్చిన లీకుల ప్రకారం ఇప్పటికే రోబో టీమ్ విజయం సాధించేసిందని సమాచారం.
శనివారం జరిగే ఎపిసోడ్ లో నాగార్జున సొహెల్ కు ఖచ్చితంగా గట్టి వార్నింగ్ ఇస్తాడు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక ఫుల్ ఎపిసోడ్ వస్తే కానీ ఎవరికీ పూర్తి క్లారిటీ రాదు. అయితే ఈరోజు ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వకుండా చూడాల్సిందే.