బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు బుల్లితెరపై ఇప్పటివరకు లేని సరికొత్త రూపకల్పనతో ప్రసారం అవుతూ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా నిలిచింది. బుల్లితెరపై ఈ షో చేసే హడావుడి అంతా ఇంతా కాదు. మొదటి సీజన్ నుండి మరే షో కి సాధ్యం కాని రీతిలో రికార్డులను బ్రేక్ చేస్తూ ఉంది. తొలిసారి అక్కినేని నాగార్జున రెండవసారి ఈ షో కి హోస్ట్ చేస్తున్న తొలి వ్యక్తిగా నిలిచాడు.
కానీ ఈసారి షో కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. కరోనా కారణంగా అనుకున్న కంటెస్టెంట్స్ లభించకపోవడంతో ఉన్న వారితో సర్దుకుపోయినా బిగ్ బాస్ కు కంటెస్టెంట్స్ దగ్గరనుండి ఎంటర్టైన్మెంట్ విషయంలో పూర్తి సహకారం లభించడం లేదు. ఇక ఇదే సమయంలో షో లో మరీ భారీ మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున స్థానంలో ఓ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందట. ఆ వివరాల్లోకి వెళితే ఎన్నో అంచనాల నడుమ బిగ్బాస్ సీజన్ నాలుగు సెప్టెంబర్ ఆరో తేదీన ప్రారంభమైంది.
అక్కినేని నాగార్జున హోష్ట్ గా ఉన్న ఫస్ట్ ఎపిసోడ్ కు మంచి స్పందన వచ్చింది. ఫలితంగా భారత దేశంలోనే అత్యధిక టిఆర్పి రేటింగ్ సాధించిన తొలి రియాల్టీ షో గా నిలిచింది. ఇక గతవారం ఐదు కోట్ల ఓట్లతో సరికొత్త చరిత్రను చరిత్రను కూడా సృష్టించింది. కానీ సీజన్ ప్రారంభానికి ముందు గత సీజన్లో తో పోలిస్తే ఈసారి రెట్టింపు వినోదం పంచబోతున్నాము అని షో నిర్వాహకులు ప్రకటించారు. అయితే వారికి కంటెస్టెంట్స్ దగ్గర నుండి సహకారం లభించలేదు.
ఎన్నో కొత్త టాస్క్ లతో ముందుకు వచ్చినా…. అందరూ సేఫ్ గేమ్ ఆడేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇక ఈ సమయంలో ఈ వారం హోస్ట్ గా నాగార్జున బదులు మరో స్టార్ హీరోయిన్ వస్తున్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో నాగార్జున ను రాజగురువుగా భావించే అనుష్క శెట్టి ఈ వారం హోస్ట్ గా వ్యవహరించనుందట. అయితే త్వరలోనే విడుదల కానున్న ‘నిశ్శబ్దం’ మూవీ మరి కొద్ది రోజులలో విడుదల కానుంది. కావున ప్రమోషన్స్లో భాగంగా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ నాగార్జున బదులు ఆమె పోస్ట్ గా షో ని ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు.