రియాలిటీ షో లలో కింగ్ మేకర్ అయిన బిగ్ బాస్ నాలుగవ సీజన్ మొదటి నెల ఊహించని ట్విస్ట్ లతో మంచి రెస్పాన్స్ అందుకుంది. మసాలా కామెడీతో పాటు ప్రేక్షకులను కట్టిపడేసే ఎమోషన్స్ అందరిని అలరించే లవ్ ట్రాక్ లతో తర్వాత భాగం ఎంతో ఉత్కంఠ ను రేపేలా ఈ షో మంచి ట్రాక్ ను సెట్ చేసుకుంది అనే చెప్పాలి. ఇక ఈ వారంలో మరికొన్ని ఊహించని మలుపులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
ఇక గత వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన జోర్దార్ సుజాత ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలు పెట్టేసింది. ముఖ్యంగా ఆమె చేసిన కామెంట్లు అన్నింటిలో మోనాల్ పై చేసినవి హాట్ టాపిక్ గా మారాయి. సుజాత కంటెస్టెంట్స్ కి సంబంధించిన కొన్ని విషయాలను ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది. హౌస్లో ఆమెది నిజంగా రెండు పడవల ప్రయాణం అని మోనాల్ ప్రేమ వ్యవహారం గురించి వ్యాఖ్యానించింది.
అసలు ఆమె తీరు ఏమిటో ఇంటిలో ఒక్కరికి కూడా అర్థం కావడం లేదని చెప్పింది. మోనాల్ చాలా క్లారిటీగా గేమ్ ఆడుతుంది అని సుజాత వ్యాఖ్యలు చేసింది. మొదటి నుండి కూడా అభిజిత్ తో ఆమె క్లోజ్ గా ఉంటుంది…. ఇక అఖిల్ ఆమె పట్ల అట్రాక్షన్ చూపిస్తూ ఉన్నాడు కానీ తను ఆడుతున్న గేమ్ గురించి మాత్రం వారిద్దరికీ అర్థం కావడం లేదు అని…. ఆమె వాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకుంటూ ఉందని చెప్పింది.
ఇక ఒకవైపు ఒకవైపు అభిజిత్ పూర్తి కన్ఫ్యూజన్ లో పడ్డాడు అని సుజాత వ్యాఖ్యానించడం గమనార్హం. అఖిల్ చాలా త్వరగా నిద్రపోతాడు అప్పుడు అభిజిత్ తో ముచ్చట్లు స్టార్ట్ చేస్తుంది. ఇక తిరిగి ఉదయం కాగానే అభిజిత్ లేనప్పుడు అఖిల్ తో మీటింగులు పెడుతుంది…. ఇలా పగలు ఒకరితో.. రాత్రి ఒకరితో మోనాల్ వ్యవహరిస్తున్న తీరు చూసి ఇంటిలో అందరూ కన్ఫ్యూజన్ కి గురి అవుతున్నారు అని సుజాత వివరణ ఇచ్చింది.