బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన టీవీ9 యాంకర్ దేవి కొద్దిరోజులకే ఎందుకో వ్యతిరేకత మూటగట్టుకుంది. ఆమె ఇంటిలో ఉన్నంతసేపు ఎప్పుడు ఎలిమినేట్ చేద్దాం అన్నట్టు ప్రేక్షకులు కాచుకొని కూర్చున్నారు. ఇక మూడో వారంలోనే ఎలిమినేట్ అయిన దేవి తన ఎలిమినేషన్ వెనుక ఎన్నో మంతనాలు జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
మొదట మూడవ వారంలో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు అని లీకులు వచ్చాయి. కానీ చివరికి దేవీ బయటకు వచ్చేసింది. ఇక ఓట్లు న్యాయంగా లెక్కిస్తే ఎక్కువ వచ్చాయని… ఆమెను కావాలనే బిగ్ బాస్ టీం ఎలిమినేట్ చేశారన్నది ఇప్పటికీ బయట టాక్. దేవీ కూడా బయటకు వచ్చాక తనకు ఓట్లు బాగానే పడ్డాయని తెలుసుకుంది. ఇదంతా పక్కన పెడితే బిగ్బాస్ తనను మోసం చేశారని భావనలో దేవీ ఉంది అని అంటున్నారు.
దేవి నాగవల్లి అందుకే ఫినాలే వేడుకలకు దూరంగా ఉంది అన్నట్లు చెబుతున్నారు. యూనియన్ లో భాగంగా ఇంట్లోకి కూడా వెళ్లలేదు. ఇక మిగిలిన వారంతా స్టేజీపైన సందడి చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో కి కూడా కనిపించలేదు బిగ్ బాస్ టీం ఆహ్వానించినా కూడా వెళ్లలేదట. ఆమె వారి ఆహ్వానాన్ని పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇక ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆమె ఎందుకు రాలేదు అంటూ కామెంట్స్ లో అడుగుతున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!