ఆంధ్రప్రదేశ్ లో బిజెపి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం దూకుడుగా రాజ్యాంగాన్ని మరియు కోర్టు నిర్ణయాలను పట్టించుకోకుండా వెళ్తున్న వైనం కేంద్రానికి నచ్చలేదట. అందుకే వారి వేగానికి బ్రేకులు వేయాలని చూస్తోంది. సెక్యూరిటీ విషయంలో కూడా బిజెపి చాలా గుర్రుగా ఉందని తెలుస్తోంది. ఇదంతా అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్ ట్విట్ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. “బిజెపి మళ్లీ ప్రజాస్వామ్య పరిరక్షణ అవతారం ఎత్తుతుందేమో….? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.. వేచి చూద్దాం!” అంటూ రవిశంకర్ ట్వీట్ చేశారు.
ఇప్పటికే ఏపీ సచివాలయాల రంగుల విషయంలో వెనకడుగు వేసిన వైసీపీ…. రాజధాని మరియు రాజధాని భూములను పేదలకు ఇళ్ల స్థలాలు గా మార్చే వ్యవహారంలో మాత్రం న్యాయస్థానం ఆదేశాలను కాదని ముందుకు పోతున్నట్లు కనబడుతోంది. ఇదే సమయంలో బిజెపి కేంద్రంలో తమ అధికారాన్ని ఉపయోగించి వారి దూకుడుకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. అంతేకాకుండా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకంపై హైకోర్టు స్పష్టం గా ఆదేశాలు ఇచ్చినా ఆయనను అధికారం చేపట్టినివ్వలేదు సరి కదా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది జగన్ ప్రభుత్వం. ఇక అక్కడ కూడా నిమ్మగడ్డకు తీర్పు అనుకూలంగా వచ్చిందంటే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి మొహం చెల్లదు.
ఇన్ని అనుమానాలు మధ్య సుజనా చౌదరితో నిమ్మగడ్డ సమావేశం అవ్వడం బిజెపి వ్యూహంలో భాగమేనని అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బిజెపి ఎటు నుంచి వస్తుంది…. ఏ రూల్ పట్టుకుని వస్తుంది అని జగన్ కాచుకుని కూర్చోవాలి. మొత్తంమీద ఏపీ వ్యవహారాలపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తన ఉనికిని చాటి ఎందుకు బిజెపి రెడీ అవుతోంది అని చాలా రోజుల నుండి ఎన్నో సూచనలు వస్తూనే ఉన్నాయి. మరి రవి శంకర్ ట్వీట్ చూసిన తర్వాత ఆ అనుమానాలన్నీ బాగా బలపడ్డాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.