Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో వరుసపెట్టి ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా కారణంగా సినీ కార్మికులకు మరియు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవి .. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాలో మలయాళం లూసిఫర్ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర కీలకం కావడంతో చిరంజీవి చెల్లెలు గా చాలా మంది సీనియర్ హీరోయిన్ల పేర్లు ఇటీవల వినబడ్డాయి. ఖుష్బూ, విజయశాంతి, రాధిక, జెనీలియా ఇందులో నయనతార పేర్లు మొన్నటిదాకా బయట వినపడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ని తీసుకోవడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు సమాచారం. వాస్తవానికి ఈ క్యారెక్టర్ చేయటానికి ముందుగా నయనతార ని స్ట్రాంగ్ గా సినిమా యూనిట్ డిసైడ్ అయిందట. అయితే అంతకు ముందే సైరాలో మెగాస్టార్ తో హీరోయిన్ పాత్ర చేయడంతో వెంటనే మళ్లీ సిస్టర్ క్యారెక్టర్ అంటే బాగుండదని నయనతార ఇటీవల రిజెక్ట్ చేయడం జరిగిందట.
Read More: Chiranjeevi: చిరంజీవి ఆ పాట విషయంలో నో అన్నారు..! కానీ.. సూపర్ హిట్టయింది..
దీంతో ఇప్పుడు నయనతార స్థానంలో చిరంజీవి చెల్లెలుగా విద్యాబాలన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో తెలుగు ప్రేక్షకులను విద్యాబాలన్ అలరించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మెగా మూవీ లో కన్ఫర్మ్ అయినట్టు వార్తలు రావడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.