Allu Arjun: సమాజంలో సెలబ్రిటీగా ఒక స్థానం వచ్చాక చేసే ప్రతి పని ఇతరులను ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. అది మంచి లేదా చెడు చేసినా కానీ సమాజంపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి విషయాలలో సినిమా ఇండస్ట్రీ పై మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. హీరోలు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు తప్పు చేసినా మీడియా ఏకీ పారేయటానికి రెడీగా కాచుకుని కూర్చుంటది. అయితే ఇటువంటి విషయాలలో బాలీవుడ్ హీరోల కంటే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ తరహాలోనే ఒక యాడ్ కి సంబంధించి బన్నీ వ్యవహరించిన తీరు…బాలీవుడ్ టాప్ హీరోలు వ్యవహరించిన తీరు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీని సౌత్ సినిమాలు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టాప్ హీరోల సినిమాలను సైతం పక్కకు వెళ్ళి పోయేలా.. నార్త్ ప్రేక్షకులను సౌత్ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “పుష్ప”.. బాలీవుడ్ ఇండస్ట్రీ లో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం తెలిసిందే. ఈ సినిమాతో బన్నీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ మార్కెట్ క్రియేట్ అయింది. ఇక అస్సలు విషయంలోకి వెళ్తే… టొబాకో యాడ్ లకి సంబంధించి విమల్ అడ్వటైజ్మెంట్ కి మంచి పేరుంది. తాజాగా ఈ సంస్థ టొబాకో ప్రోడక్ట్ కి సంబంధించి యాడ్ విషయంలో బాలీవుడ్ బడా హీరోలు అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ లతో యాడ్ చిత్రీకరించింది. ఇందుకుగాను ఈ ముగ్గురు హీరోలు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇదే సమయంలో ప్రముఖ పొగాకు కంపెనీ…తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని.. ఇటీవల బన్నీ ని సంప్రదించడం జరిగిందట. ఇందుకుగాను భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసిందట. దీనికి బన్నీ సున్నితంగా.. నిర్మొహమాటంగా “నో” చెప్పేశాడట. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం అనేది అసంభవం అని .. ఆఫర్ ని తిరస్కరించాడట.
దీంతో బన్నీ యాటిట్యూడ్ కి బాలీవుడ్ సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇటువంటి హీరోలు ఉంటే బాగుండును అంటూ బన్నీ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రజల ప్రాణాలను పరిగణలోకి తీసుకోకుండా హీరోలు డబ్బు కోసం ఎటువంటి గబ్బు యాడ్ లు చేసే దుస్థితి బాలీవుడ్ లోనే ఉంది అంటూ ఇటీవల అక్షయ్, షారుక్, అజయ్ దేవగన్ నటించిన యాడ్ పై సెటైర్లు వేస్తున్నారు. ఈ ముగ్గురు హీరోలు బన్నీ ని చూసి బుద్ది తెచ్చుకోవాలని అంటున్నారు. కాగా 2018లో తనకు ప్రముఖ గుట్కా కంపెనీల నుండి ఆఫర్ లు చాలా వచ్చాయని … డబ్బు కూడా బాగా ఆఫర్ చేయడం జరిగిందని.. రిజెక్ట్ చేసేసాను అంటూ అక్షయ్ కుమార్.. స్వచ్ఛభారత్ ప్రమోటింగ్ కార్యక్రమంలో మీడియా సమక్షంలో తెలిపారు. ఈ మాట చెప్పి నాలుగు సంవత్సరాలలోనే అనగా ..ఈ సంవత్సరం ప్రముఖ పొగాకు ఉత్పత్తి కంపెనీ విమల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన ఆఫర్ కి తోటి స్టార్ హీరోలు.. షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ లతో కలసి అక్షయ్ చేసేశాడు. ఈ పరిణామంతో బాలీవుడ్ ప్రేక్షకులు.. సౌత్ హీరోలను చూసి బాలీవుడ్ హీరోలు చాలా నేర్చుకోవాలని సెటైర్లు వేస్తున్నారు.