పదేళ్ల క్రితం ఇంట్లో పిల్లలు ఎంచక్కా ఆరుబయట ఆడుకునేవారు. గల్లీలో కబడ్డీ, క్రికెట్ వంటి వరల్డ్ క్లాస్ గేమ్స్ తో పాటుగా గోలీలు, దాగుడుమూతలు, దొంగ-పోలీస్ వంటి ఎన్నో చిన్నచిన్న ఆటలాడుతూ వీధంతా సందడి చేసే వారు. ఇప్పుడు ఆ దృశ్యం అసలు కనిపించడం లేదు. పిల్లలు మొబైల్ చేతిలో పెట్టుకొని ఆన్లైన్ గేమ్స్ కి బాగా మరిగిపోయారు. దీంతో వారికి కావలసిన మానసిక ఉత్సాహం, శారీరిక తోడ్పాటు పూర్తిగా కరువయ్యాయి. ఇది పిల్లల మానసిక పరిస్థితి పై బాగా ప్రభావం చూపుతోంది. ఇలాంటి సంఘటనలు వందలకొద్దీ జరిగినా కూడా అందరూ కాలంతో కలిసి ముందుకు సాగుతున్నారు తప్ప దీనికి స్వస్తి చెప్పే యోచనలో లేరు.
ఇదంతా చెబుతుంది ఎందుకు అంటే…. ఇండోర్ కి చెందిన ఒక 11 ఏళ్ల బాలుడు పక్కింట్లో ఉండే 10 ఏళ్ల అమ్మాయిని ఆన్లైన్ గేమ్ లో ఓడిపోయాడన్న కోపంతో కొట్టి చంపేశాడు. వినడానికి ఎంతో విచిత్రంగా ఉన్నా ఇది వాస్తవం. ఫ్రీ ఫైర్ గేమ్ లో ఓడిపోయాడు అని బాలికను హత్యచేశాడో బాలుడు. ఆరో తరగతి చదువుతున్న బాలుడు 5వ తరగతి చదువుతున్న బాలిక కలిసి ఆన్లైన్ లో గేమ్ పబ్జి గేమ్ లాగే ఉండే ఒక గేమ్ ను మొబైల్ లో తరచూ ఆడేవారు. అయితే ఆమె చేతిలో ఈ బాలుడు ఎప్పుడూ ఓడిపోయేవాడు. దాంతో ఆ బాలికపై కోపంతో రగిలిపోయాడు.
ఈ క్రమంలోనే ఆ బాలుడు ఇష్టంగా పెంచుకున్న ఎలుక కూడా మరణించింది. ఇక ఇది కూడా ఆ బాలికే చేసి ఉంటుందని అనుమానించాడు. ఆ బాలిక మాత్రం తనకేమీ తెలియదని అసలు తాను దాని జోలికి వెళ్లలేదని చెప్పింది. అయినా ఈ పని ఆమే చేసి ఉంటుందని కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం పూల కోసం వెళ్లిన బాలిక పై దాడి చేసి చంపేశాడు. ఇరువురి మధ్య గొడవ జరుగుతుండగా స్థానికులు చూశారు. పరస్పరం వల్ల రాళ్లతో దాడి చేసుకుంటుంటే మధ్యలో వెళ్ళేందుకు భయపడ్డారు.
అయితే బాలిక నుదిటిపై రాళ్ళు బలంగా తగలడంతో ఆమె మరణించింది. ఈ భయంతో ఆ పిల్లవాడు అక్కడి నుండి పారిపోయాడు. బాలిక మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సిసిటివి ఫుటేజీలో ఆ బాలుడి ఆ అమ్మాయిని దాడి చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. రంగంలోకి దిగిన పోలీసులు నేరుగా అతని ఇంటికి వెళ్లి ఆ పిల్లవాడిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన రెండు గంటల్లో నిందితుడి అరెస్టు జరిగింది. ఇక కోర్టులో ప్రవేశపెట్టికి ఆ బాలుడిని జువెనైల్ కోర్టుకి తరలించారు.
ఈ హత్యలో ఇంకొకరి హస్తం కూడా ఉందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడేళ్ళ పిల్లాడి నుంచి ఇంజనీరింగ్ వరకు అందరూ ఇలా ఆన్లైన్ లో మునిగిపోతే చివరికి ఇటువంటి దారుణాలే చూడవలసి వస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?