Brahmanandam: భక్తులు దేవుడు తమ కోరికలు తీర్చాలని పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉంటారు.. ఆపద సమయంలో తమ కష్టాలను తీర్చమంటూ ముడుపులు పెడుతూ ఉంటారు.. దేవుడు తమ కష్టాలనుండి గట్టెక్కించిన వెంటనే మొక్కులను చెల్లించుకుని తమ భక్తిని చాటుకుంటారు.. అయితే దేవుళ్ళు ఏ ప్రాంతంలో జన్మించారు అనే విషయాన్ని ఏ భక్తుడు పట్టించుకోడు.. కొన్ని రోజులుగా హనుమంతుడు జన్మస్థలం గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ విషయంపై హాస్యనటుడు బ్రహ్మానందం స్పందించారు..!!
హనుమంతుని జన్మ స్థలం అంశంపై ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఓ టీవీ ఛానల్ లో నిర్వహించిన డిబేట్ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వ్యాఖ్యానించారు.. భక్తికి నిదర్శనం హనుమంతుడిని.. ఆయన ఎక్కడ పుట్టారు అనే విషయాన్ని వివాదాస్పదం చేయొద్దని బ్రహ్మానందం కోరారు.. ఇటువంటి వివాదం ఏమాత్రం సమంజసం కాదని.. హనుమంతుడు ఎక్కడ పుట్టారు అనే విషయం పై వాదనలు చేసుకోవడం సరికాదన్నారు. ఆయన హనుమంతుడు మనదేశంలోనే పుట్టారని గర్వ పడితే బాగుంటుందని తెలిపారు.. ఆంజనేయుడు అందరివాడిని.. ఈ అంశాన్ని వివాదాస్పదం చేయరాదని కోరారు బ్రహ్మానందం..
ఇటీవల హనుమంతుడు జన్మ స్థలం గురించి తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి చేసిన ప్రకటనకు చర్చకు కారణమైంది. ఏడుకొండల్లోని అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని టిటిడి ప్రకటించింది. దీనిపై కర్ణాటకలోని కిష్కింద ట్రస్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హనుమంతుని జన్మస్థలం కిష్కింద అని వాదించారు. ఇరు పక్షాల మధ్య చర్చలు జరిగినప్పటికీ తుది నిర్ణయానికి రాలేకపోయాయి. దీంతో హనుమంతుడి స్థలంపై జన్మస్థలం పై వివాదం చెలరేగడం వివాదం చెలరేగింది. హిందూ భక్తులు బాధపడుతున్నారు.