సుప్రసిద్ధ భారతదేశ చలన చిత్ర గాయకులు పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నేడు చెన్నైలో ఆరోగ్యం క్షీణించి మరణించారు. గత కొద్ది వారాలుగా కోవిడ్ సోకడంతో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల ఎస్పీ గారు ఆసుపత్రిలో ఉన్నారు.
రోజురోజుకీ అతడి ఆరోగ్యం క్షీణించడంతో చివరికి అతనికి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలకవలసి వచ్చింది. దేశంలోని చాలా మంది ప్రముఖులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పార్థివ దేహాన్ని చూసేందుకు తరలి వెళ్తున్నారు.
రేపు సాయంత్రం చెన్నైలోని తిరువల్లూర్ జిల్లా రెడ్ హిల్స్ సమీపంలోని తామరైపాకంలో బాలసుబ్రహ్మణ్యం గారి అంతక్రియల కార్యక్రమం జరగనుంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఎస్పీబి గారి మృతదేహం ఎంజీఎం ఆసుపత్రి నుండి కోడంబాకం లోని ఎస్పీ చరణ్ ఇంటికి తరలించనున్నారు.