Breaking: మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే సర్కార్ బలపరీక్ష అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గవర్నర్ ఆదేశాల మేరకు రేపు బలపరీక్ష నిర్వహణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్దర్ సర్కార్ బలపరీక్ష ఎదుర్కొనే అంశంపై సుప్రీం కోర్టులో బుధవారం సాయంత్రం దాదాపు మూడున్నర గంటల పాటు వాదోపవాదాలు జరిగాయి. ఇటు ఉద్దవ్, అటు ఎక్ నాథ్ శిందే తరపున సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు బలంగా వినిపించారు. అసెంబ్లీలో బలపరీఘను ఎప్పుడూ జాప్యం చేయకూడదని, రాజకీయ జవాబుదారీతనానికి బేరసారాలు జరక్కుండా నిరోధించేందుకు బలపరీక్ష నిర్వహించడమే ఏకైక మార్గమని శిందే తరపు న్యాయవాది నీరజ్ కృష్ణ కౌల్ వాదించారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం జాప్యమవుతోందన్న కారణం చూపించి బలపరీక్ష వాయిదా వేయాల్సిన అవసరం లేదని అన్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గురువారం మధ్యాహ్నం 11 గంటలకు బలపరీక్ష నిర్వహించాలని ఉద్దవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని రాష్ట్ర గవర్నర్ ఆదేశించడాన్ని శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. దీనిపై ప్రభు తరపున హజరైన అడ్వొకేట్ ఏఎం సింఘ్వీ తన వాదనలు వినిపించారు. గురువారమే అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించడం చాలా హడావిడిగా తీసుకున్న నిర్ణయమని, అపవిత్రమని ఆయన అన్నారు. బలపరీక్షను వారం పాటు వాయిదా వేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనల అనంతరం రాత్రి 9 గంటలకు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.
అవిశ్వాస తీర్మానంపై గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం ధర్మాసనం సమర్ధించింది. కాగా ఒ పక్క సుప్రీం కోర్టు వాదనలు జరుగుతున్న సమయంలో ఉద్దవ్ కేబినెట్ భేటీ నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీలో ఉద్వేగభరితంగా మాట్లాడినట్లు తెలుస్తొంది. రేపు బలపరిక్షకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎం ఉద్దవ్ ఠాక్రే నేడు రాజీమానా చేస్తారా లేక అసెంబ్లీ వేదిక గానే రాజీనామా సమర్పిస్తారా అనేది చర్చనీయాంశంగా ఉంది. కాగా ప్రభుత్వ అవిశ్వాస తీర్మానం దృష్ట్యా ముంబాయిలో హైఅలర్ట్ ప్రకటించారు. అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.