BSNL Offer: BSNL ఎప్పుడు తన కస్టమర్లను ఆకట్టుకునేందుకు బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తూ ఉంటుంది.. తాజాగా తన కస్టమర్లకు శుభవార్త తెలిపింది.. మరింత మంది వినియోగదారులను పెంచుకునేందుకు బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ అందిస్తోంది.. కొత్తగా బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్, ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది..!! ఈ ఆఫర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!
సాధారణంగా కొత్త బ్రాడ్ బ్యాండ్, ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకోవడానికి ఇన్స్టాలేషన్ ఫీజు రూ.250 చెల్లించాలి. ఇప్పుడు ఈ మొత్తం ఎమౌంటు చెల్లించనవసరం లేదు.. ఈ ఆఫర్ దేశ వ్యాప్తంగా వర్తిస్తుంది. ఈ ఆఫర్ కేవలం ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం బీఎస్ఎన్ఎల్ కొత్త బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకునే వారు త్వరపడండి.. ఈ అద్భుత అవకాశం మీకోసమే..