Chaavu Kaburu Challaga : యంగ్ హీరో కార్తికేయ , లావణ్య త్రిపాఠి జంట గా నటిస్తున్న చిత్రం చావు కబురు చల్లగా ..! ఈ సినిమాకి కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది.. తాజాగా ఈ చిత్రం నుంచి “మై నేమ్ ఈజ్ ఇజు రాజు” పాట మేకింగ్ వీడియో ను విడుదల చేశారు.. ఈ వీడియో అభిమానులను ఎంతగానో అలరించింది..
అల్లు అరవింద్ సమర్పణలో లో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, పాటలు సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా కి కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించారు . శివకుమార్ గుజ్జుల అడిషనల్ డైలాగులు రాశారు. మురళీ శర్మ, రజిత, మహేష్, ప్రభువు, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మేకింగ్ వీడియో కు విశేష స్పందన వస్తోందోది.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు చావు కబురు చల్లగా గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ CMR మాల్ వైజాగ్ లో జరగనుంది..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?