Chhota Rajan: కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి చెందారు.. ఢిల్లీ గేమ్స్ లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం చోటా రాజన్ తుది శ్వాస విడిచారు..
ముంబై దోపిడీ, హత్యలకు సంబంధించి 70 క్రిమినల్ కేసులను రాజన్ ఎదుర్కొంటున్నాడు. 2015లో రాజన్ అరెస్టు అయ్యారు. 2018లో జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ హత్య కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే. దీంతో అతనికి జీవిత ఖైదు విధించారు. రాజన్ పై ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి బదిలీ చేశారు. ఈ కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కు ఏప్రిల్ 26న కరోనా వైరస్ సోకిన విషయం అందరికి తెలిసిందే. అయితే రాజన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను జైలు నుండి ఢిల్లీ ఎయిమ్స్ హాస్పటల్ కు ఏప్రిల్ 27న తరలించారు. కోవిడ్ సోకడంతో ప్రత్యేక వార్డులో సాయుధ పోలీసుల పర్యవేక్షణలో అతనికి చికిత్స అందించినప్పటికీ.. రాజన్ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందారు..