భారత దేశ కేంద్ర ప్రభుత్వం చైనా కు సంబంధించిన 59 మొబైల్ అప్లికేషన్స్ ను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే మన వారు ఇప్పుడు సరిహద్దుల్లో చైనా వారు చేస్తున్న పనులకు మరియు గోప్యత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి ఏడ్చి గగ్గోలు పెడుతున్నార్య్ కానీ దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అప్లికేషన్లను చైనీయులు మాత్రం తమ దేశంలో బహిష్కరిస్తూనే ఉన్నారు.
చైనా దేశంలో ఇంటర్నెట్ పై నియంత్రణ మరియు సెన్సార్ షిప్ చాలా ఎక్కువగా ఉంటుంది. గూగుల్, ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్, వాట్సాప్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్ లు మరియు సెర్చ్ ఇంజన్ల పై అక్కడ నిషేధం ఉండడం గమనా.ర్హం చైనా ప్రభుత్వం నిషేధించిన ఈ యాప్స్ స్థానంలో చైనా దేశస్తులు డెవలప్ చేసిన అప్లికేషన్లు చైనీయులు వాడుతుంటారు.
ఇకపోతే యూట్యూబ్, టిండర్ మరియు కోరా అప్లికేషన్లను కూడా చైనా వారు వారి దేశంలో వాడేందుకు అనుమతించరు, ఇలా వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది సాఫ్ట్వేర్ టెక్నీషియన్స్ తయారు చేసిన యాప్స్ ను బహిష్కరిస్తూ తమ దేశంలో లో ఉన్న వారిని కొత్తరకం యాప్స్ తయారు చేసేందుకు ప్రోత్సహిస్తూ వాటిని ఇతర దేశస్తులు పై వదులుతుంటారు. కానీ అదే సమయంలో కస్టమర్స్ దగ్గర నుండి సెన్సిటివ్ సమాచారాన్ని ఈ యాప్స్ సేకరించడం చాలా ప్రదేశాల్లో ప్రభుత్వానికి నప్పదు. అందుకే వారు చైనా యాప్స్ ను తమ దేశంలో వాడనివ్వకుండా బహిష్కరిస్తూ ఉంటారు.