కరోనా పుట్టుకకు కారణం కావడమే కాకుండా ఇతర దేశాలపై చైనా చేస్తున్న దురాక్రమణకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆ దేశం పై వ్యతిరేకత రోజురోజుకీ పెరిగిపోతోంది. కొద్ది వారాల క్రితం ఆస్ట్రేలియాలో చైనా వారు సైబర్ అటాక్ కు పాల్పడినట్లు ఆ దేశ ప్రభుత్వమే వెల్లడించగా…. సరిహద్దు వద్ద కూడా భారత సైనికుల పై కవ్వింపు చర్యలకు పాల్పడి వారి ప్రాణాలను తీసిన చైనావారి తీరుని ఇప్పుడు అన్నీ దేశాలు తప్పు పడుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇదే సమయంలో భారత్ కు మద్దతు కూడా భారీగా పెరుగుతోంది. చైనా భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వారి దేశానికి సంబంధించిన యాభై 59 యాప్స్ ను భారతదేశం నిషేధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వారికి సంబంధించిన కాంట్రాక్టులను కూడా రద్దు చేయడం స్టార్ట్ చేసింది. ఇదే సమయంలో జపాన్ దేశం నుండి భారత్ కు భారీగా మద్దతు లభిస్తోంది. అలాగే చైనాకు కూడా గట్టి హెచ్చరికలు పంపింది.
తాజాగా జపాన్ అంబాసిడర్ సతోషి సుజికీ భారత్-చైనా ఘర్షణలపై స్పందించారు. భారత్ కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని.. చైనాకు హెచ్చరికలు చేస్తున్నట్టు తెలిపారు. చైనా సరిహద్దుల్లో చేస్తున్న ప్రయత్నాలను జపాన్ వ్యతిరేకిస్తుందని సుజుకీ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన భారత్ కు మద్దతు తెలుపుతూ ఓ పోస్ట్ చేశారు.
భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ తో జపాన్ బ్రాండ్ అంబాసిడర్ సుజుకి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా భారత్ చైనాల మధ్య శాంతియుత పరిష్కారం దొరకాలని ఆశిస్తున్నట్లు తెలపగా వ్యతిరేకిస్తున్నట్లు మరియు భారత్ కు ఎటువంటి సహాయం కావాలన్నా సంపూర్ణ సహకారాలు అందిస్తామని తెలియజేయడం విశేషం.