చైనా దేశం కుట్ర పూరిత చర్యలకు పూనుకుందనే సమాచారంతో మన దేశ ప్రభుత్వం చైనా వస్తువుల మీద ఎన్నో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అలాగే చైనా మన బార్డర్ లో చేసే పలు చట్ట వ్యతిరేక చర్యలను తిప్పి కొట్టడానికి మన దేశం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ దేశ కంపనీ ఒకటి చేసిన మోసం ఒకటి భయటకు వచ్చింది. అది తెలుస్తే మీరు షాక్ అవుతారు. మరీ ఇంత నీచానికి దిగజారుతారా ? అనే ప్రశ్న కూడా వస్తుంది.
ఇక విషయాలనికి పోతే.. చైనా దేశానికి చెందిన పెద్ద మొబైల్ కంపనీ జియోనీ. ఈ కంపనీ ట్రోజన్ హార్స్ అనే వైరస్ ను ఉద్దేశపూర్వకంగా 20 మిలియన్ల కంటే ఎక్కువ ఫోన్లల్లో ఎక్కించినట్లు చైనా దేశంలో కేసు నమొదు అయ్యింది. దాంతో కోర్టు జియోనీ కంపనీ ఫోన్లపై విచారణ చేపట్టమని ఆదేశించింది. ఆ విచారణలో ఎన్నో విషయాలు భయట పడ్డాయి. వినియోగదారులకు తెలియకుండానే ఫోన్ వాడే వ్యక్తుల మొబైల్ లో అనవసర యాడ్స్, అలాగే హానికరమైన వైరస్ ను అప్డేట్ పేరుతో ఇన్ బిల్ట్ చేశారని తేలింది.
జియోని ఈ స్కామ్ కోసం కోట్లలో ముడుపులు చెల్లించిన్లు తేలింది. అయితే ఈ జియోని అనుబంధ సంస్థ అయిన షెన్ జెన్ జిపు టెక్నాలజీ స్టోర్ లాక్ స్క్రీన్ యాప్ ను వాడుకుని సాఫ్ట్వేర్ అప్డేట్ పేరుతో ట్రోజన్ హార్స్ ను ఇన్ స్టాల్ చేశారు. 2018లో మొదటిసారిగా ఈ వైరస్ ను జియోని ఇన్ స్టాల్ చేయడం ప్రారంభించిందని విచారణలో తేలింది.
ఇలా వైరస్ ను 2019 అక్టోబర్ వరకు కొనసాగించిందంట. దీంతో 21.75 మిలియన్ స్మార్ట్ ఫోన్లలో వైరస్ ను ప్రవేశపెట్టినట్లు విచారణ లో తేలింది. ఈ వైరస్ ను ఫోన్లలో ఇన్ స్టాల్ చేయడంతో 4.2 మిలియన్ డాలర్లను జియోని సంపాధించిందని తెలిసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు జో యింగ్, జియా జెంగ్కియాంగ్, పాన్ క్వి లను దోషులుగా తేల్చింది. ఈ ముగ్గురికి 3 నుంచి 3.5 ఏళ్ల జైలు శిక్షను కరారు చేసింది.
దాంతో పాటు ఒక్కొక్కరికి రూ. 22,59,738 ఫైన్ వేసింది. దీంతో పలు ఆశ్చర్యం కలిగించే విషయాలు భయటకు వస్తున్నాయి. చౌకైన ఫోన్లను ఉత్పత్పి చేసే ఎన్నో చైనా కంపనీలు ఇదే తరహాలో వైరస్ ను ఫోన్లలో ఇన్ స్టాల్ చేస్తున్నాయని ఈ విచారణలో తేలింది. ఆ లిస్ట్ లో ఇన్ఫినిక్స్, టెక్నో వంటి కంపనీలు ఉన్నాయి.