కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “సైరా నరసింహారెడ్డి” తర్వాత చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ కొరటాల శివ చాలా టైం వెయిట్ చేయడం జరిగింది. సరిగ్గా సినిమా స్టార్ట్ అయ్యి 40శాతం పూర్తయిన తర్వాత మహమ్మారి కరోనా వైరస్ రావడంతో సినిమా షూటింగ్ ఆగిపోవటంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ కాపీ అన్నట్లు సరికొత్త వివాదం మొదలైంది. 2006వ సంవత్సరంలో “పుణ్యభూమి” అనే టైటిల్ కలిగిన స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించినట్లు రచయిత అనిల్ కృష్ణ ఇటీవల ఆరోపించడం జరిగింది. ఇటువంటి తరుణంలో చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సన్నివేశం ధర్మస్థలి సన్నివేశం కావడంతో…. ఆచార్య సినిమా స్టోరీ తనదే అనిల్ కృష్ణ ఆరోపిస్తున్నారు.
దీంతో కొరటాల శివ సినిమా స్టోరీ కి సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి రంగం లోకి దిగుతున్న ట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా ఆలస్యం అవుతున్న తరుణంలో…. ఇలాంటి ఆరోపణలపై ఫుల్ క్లారిటీ ఇవ్వాలని, మొక్కగా ఉన్నప్పుడే సందేహాన్ని పీకేయాలి అని కొరటాల త్వరలో వస్తున్న ఆరోపణలపై మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండగా చాలాకాలం తర్వాత మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై మెగా అభిమానులకు అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.