మెగాస్టార్ చిరంజీవి ఇటీవల బిగ్ బాస్ సీజన్ ఫోర్ గ్రాండ్ ఫినాలే రోజు టైటిల్ విన్నర్ ప్రకటించడానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. చిరు రాకతో పాటు ఎంటర్టైన్మెంట్ భారీ స్థాయిలో గ్రాండ్ ఫినాలే రోజు ఆడియన్స్ కి అందింది. చిరంజీవి వేసిన డైలాగులు, హావభావాలు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బా నవ్వించాయి. ఇదిలా ఉండగా తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ వారు టాప్ హీరోయిన్ అక్కినేని వారి కోడలు సమంతతో ‘సామ్ జామ్’ అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ షోలో ఇటీవల చిరంజీవి పాల్గొనగా ఆ కార్యక్రమాన్ని క్రిస్మస్ సందర్భంగా స్ట్రీమింగ్ లో ప్రసారం చేశారు. ఈ ప్రోగ్రాం లో కూడా చిరంజీవి ఎంతగానో ఎంటర్టైన్మెంట్ అందించారు. ఈ క్రమంలో చిరంజీవి తన పర్సనల్, అదేవిధంగా రాజకీయంగా అనేక విషయాల గురించి చెప్పుకొచ్చారు. అయితే వీటిలో అన్ సీన్ క్లిప్పింగ్స్ ని ఆహా టీమ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో కార్యక్రమంలో సమంతా మీ లైఫ్ లో రివైండ్ చేసే అవకాశం వస్తే మీరు దీన్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించింది.
ఈ ప్రశ్నకు చిరంజీవి ఆసక్తికరమైన జవాబు చెప్పారు. నిజంగా అదే అవకాశం వస్తే.. సరిగ్గా ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళి చైనాలో కరోనా వైరస్ లీక్ అయిందని చెప్తున్న బిల్డింగ్ ను భూస్థాపితం చేసి ఆ వైరస్ ను బయటకు రాకుండా చేయాలనేది నా కోరిక’ అని చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలను తేలికగా తీసుకుంటారు కానీ వేట సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఇంటిలో దుప్పటి కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చాను అని చిరంజీవి తెలిపారు.