Chittimallelu: రక్తంలో గ్లూకోజ్ హెచ్చు తగ్గుల వలన డయాబెటిస్ వస్తుంది.. మధుమేహం రాగానే ఎక్కువ మంది చెప్పేది వైట్ రైస్ తినడం మానెయ్యమని.. లేదంటే చపాతీ తినమని చెబుతుంటారు.. మరి కొందరు చిరు ధాన్యాలు ఆన్నంగా తీసుకో మంటారు.. అయితే అన్నం తినకుండా ఉండలేక అలాగే ఏదో ఒకటి తింటూ కాలం గడుపుతున్నారు.. అటువంటి వారికి గుడ్ న్యూస్.. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే రైస్ డయాబెటిక్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుందని పలు అధ్యయనాలలో నిరూపితమైంది.. ఆవే చిట్టి మల్లెలు లేదా తెలంగాణ సోనా బియ్యం..!! చిట్టి మల్లెలు బియ్యం ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..!!
చిట్టి మల్లెలు బియ్యం లో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. దీని వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.. ఈ బియ్యం ను మన తెలంగాణ వారు పండిస్తున్నారు. ఈ రైస్ ఆన్లైన్ , ఈ కామర్స్ సైట్స్ లో అందరికీ అందుబాటులోకి వచ్చాయి. వీటిని రైతులు తక్కువగా పండించడంలో ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.తెలంగాణలో పండిస్తున్న చిట్టి మల్లెలు అని పిలవబడే తెలంగాణ సోనా బియ్యం రకం కువైట్ దేశానికి ఎగుమతి అవుతున్నయి.
అమెరికా జర్నల్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ప్రకారం చైనా, జపాన్, కొరియాలో పండించే రకం కంటే మన తెలంగాణ సోనా రకం బియ్యం లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. గ్లైసిమిక్ ఇండెక్స్ విలువలు తక్కువ గల ఈ బియ్యానికి విదేశీ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. బి ప్యాచ్ ఉన్న ఈ రైస్ డయాబెటిక్ ఉన్న వారికి మేలు చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల గ్లూకోస్ లెవెల్స్ నియంత్రణలో ఉంచడానికి చిట్టి మల్లెలు బియ్యం అద్భుతంగా సహాయపడుతాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ బియ్యం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?