IPL: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ ఐపీఎల్ పై నెగిటివ్ కామెంట్లు చేశారు. గత రెండు సంవత్సరాల నుంచి ఐపీఎల్ లో మంచి ఆటతీరు కనబరుస్తున్న… తగిన గౌరవం లభించడం లేదని పేర్కొన్నారు. ఇటీవల మీడియాతో క్రిస్ గేల్ మాట్లాడుతూ… ఐపీఎల్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. అయినా కూడా దక్కాల్సిన గౌరవం దక్కలేదు. దీంతో ఎవరినీ బాధ పెట్టాలన్న ఉద్దేశ్యం లేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అందువల్లనే ఈ ఏడాది వేలంలో కూడా పాల్గొన లేదు. క్రికెట్ మాత్రమే కాదు ఇంకా జీవితం ఉందని గుర్తించి పెద్ద పట్టించుకోవటం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మాత్రమే కాదు గత ఏడాది ఐపీఎల్ సీజన్ మధ్యలోనే గేల్ బయటకు వెళ్ళిపోయాడు. ఐపీఎల్ లో క్రిస్ గేల్ కి ఉన్న ట్రాక్ రికార్డ్ మరే ప్లేయర్ కి లేదు. దాదాపు ఆరు సెంచరీలు గేల్ సాధించడం జరిగింది. మొత్తం 142 మ్యాచ్ లు ఆడిన క్రిస్ గేల్…4965 పరుగులు సాధించడం జరిగింది.
ఇటువంటి బ్యాటింగ్ యావరేజ్ ఐపీఎల్ లో మరే ఆటగాడికి లేదు. ఈ క్రమంలో ఐపీఎల్ లో తనకి సరైన గౌరవం దక్కలేదు అని క్రిస్ గేల్ తాజాగా వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. క్రిస్ గేల్ ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ టీం లలో ఆడటం జరిగింది. దాదాపు నాలుగు సీజన్ లు క్రిస్ గేల్ ఆడారు. అయితే బాగా ఆడిన గాని తగిన గౌరవం లభించకపోవడంతో.. ఐపీఎల్ సీజన్ లో పాల్గొనలేదని.. తాజాగా చెప్పుకు రావడం సెన్సషనల్ గా మారింది.