Ali: 2019 ఎన్నికల సమయంలో కమెడియన్ ఆలీ వైసీపీ పార్టీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఆలీ వైసిపి పార్టీకి మద్దతుగా మైనార్టీ ప్రభావం కలిగిన ప్రాంతాలలో భారీగా ప్రచారం చేశారు. జరిగిన ఎన్నికలలో వైసిపి తిరుగులేని విజయం సాధించడం తెలిసిందే. దీంతో జగన్ ముఖ్యమంత్రి కావడంతో కమెడియన్ ఆలీకి ఒక మంచి పదవి వస్తున్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ఆలీ కూడా ఎదురుచూస్తూ ఉన్నట్లు టాక్ నడిచింది.
పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యల గురించి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి మహేష్ ప్రభాస్ ఇంకా మరికొంతమంది భేటీ అయిన సమయంలో అలీ కూడా సమావేశానికి రావటం తెలిసిందే. అయితే సమావేశం అనంతరం సీఎం జగన్ అలీకి.. రాజ్యసభ సీటు ఇవ్వడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది. త్వరలోనే నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న తరుణంలో ఒకటి మైనారిటీలకు వైసీపీ పార్టీ కేటాయించడంతో… దానిని ఆలీకి కేటాయించాలని సీఎం జగన్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆలీ రాజ్యసభలో అడుగుపెట్టనున్నట్లు వారం రోజుల్లో.. క్లారిటీ రానున్నట్లు సమాచారం. ఇప్పటికీ కూడా ఆలీ వైసిపి పార్టీకి సంబంధించి కొన్ని కార్యక్రమాలలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలలో పాల్గొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో లో కమెడియన్ అలీకి రాజ్యసభ సీటు ఖరారు చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు రావడంతో… ఏపీ రాజకీయాలలో అదేవిధంగా వైసీపీ పార్టీలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఇండస్ట్రీ నుండి .. వైసిపి పార్టీని ఎంతగానో సపోర్ట్ చేస్తూ వస్తున్న పోసాని కృష్ణ మురళికి కూడా పదవి ఇవ్వాలని జగన్ ఆలోచన చేస్తున్న… పోసాని తనకి ఎటువంటి పదవి అవసరం లేదని.. కచ్చితంగా పార్టీకి మాత్రం సపోర్ట్ చేస్తాను అని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.