కూల్ డ్రిక్స్ అంటే చాలు గుటకలేసే వారు ఎంతో మందున్నారు. వెనకా ముందు ఆలోచించకుండా డబ్బాలకు డబ్బాలను లాగించేస్తుంటారు కదా.. మరి ఈ వార్త వింటే మరి తాగుతారో లేదో చూడాలి..! శీతల పానియాలతో మన ప్రాణాలకు ముప్పుందని కొన్ని సర్వేలు తాజాగా వెల్లడిస్తున్నాయి. ఫ్రాన్స్ లోని ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ నిర్వహించిన పరిశోధనలో నీల్ మర్ఫీ పరిశోధకుడు తెలిపిన వివరాల ప్రకారం.. కూల్ డ్రిక్స్ తీసుకోవడం వల్ల ప్రాణానికే ముప్పు ఉందని స్పష్టం చేశారు. సోడా ఆధారిత డ్రింక్స్ లలో అధిక మొత్తంలో కృత్రిమ చక్కెరను ఉపయోగించడమే ఇందుకు కారణమని తెలిపారు.
ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలను ‘జామా ఇంటర్నె షనల్ మెడిసిన్ జర్నల్’ లో ప్రచురించారు. 16 ఏండ్ల పరిశోధనలో కొన్ని కీలక విషయాలను తెలుసుకున్నారు. కొన్నేండ్లుగా 10 యూరోపియన్ దేశాల్లో 4,52,000మంది పురుషులపై, మహిళలపై ఈ పరిశోధనలు చేసి భయంకర నిజలను వెళ్లడించారు.
ఈ అధ్యయనంలో పేర్కొన్న వివరాల ప్రకారం 43 శాతం మంది క్యాన్యర్ల వల్ల, 21.8 శాతం మంది రక్త ప్రసరణ సమస్యల వల్ల, 2.9 శాతం జీర్ణ సంబంధిత వ్యాధుల మూలంగా మరణించారని వెళ్లడించారు. ఈ మరణాలు కేవలం శీతల పానియాలు సేవించడం మూలంగానే అని నిదర్శనమైంది. మరీ ముఖ్యంగా శీతల పానియాలు అధికంగా సేవించడం వల్ల ఏర్పడే ప్రధాన సమస్య డయాబెటీస్. దీనికి కారణం వీటిలో ఉండే అధిక కేలరీలు మధుమేహానికి దారి తీస్తాయని వెళ్లడించారు. అలాగే దంతాలకు కూడా ఇది ప్రమాధకరమని చెప్పొచ్చు.
కూల్ డ్రింక్ ఉండే ఫాస్పోరిక్, కార్బోనిక్ ఆమ్లాల వల్ల దంత క్షయం ఏర్పడుతుంది. దీనితో పాటు మరీ ముఖ్యంగా దంతాలను నాశనం చేస్తుంది. వీటితో పాటే ముఖ్యంగా గుండె జబ్బులు, అధిక బరువు, మొదడు మొద్దుబారడం, శరీరంలో లోపలి భాగాలు చెడిపోవడం వంటివి జరుగుతాయి. మరీ ముఖ్యంగా సోడా ఆధారిత డ్రింక్స్ మూలంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. ఇక నైనా ఈ విషయాలను గమనంలో ఉంచుకుని వీటికి దూరంగా ఉంటే మీ ఆరోగ్యానికే మంచిది.