Kidneys: శరీరంలో అతి ముఖ్యమైన భాగాలు కిడ్నీలు ఒకటి.. రక్తాన్ని శుద్ధి చేసి వాటి లోని మలినాలను తొలగించడమే వీటి ప్రధాన కర్తవ్యం.. శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు నెట్టి వేసాయి.. మూత్ర రూపం లో వ్యర్ధాలను తొలగిస్తాయి.. కిడ్నీలు సక్రమంగా పనిచేస్తేనే మిగతా భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి.. శరీరంలో నిరంతరం పనిచేస్తూ ఉండే ఈ కిడ్నీలు మలినాలను తొలగించే ప్రక్రియలో కిడ్నీలో మలినాలు నిక్షిప్తమై రాళ్లు, ట్యూమర్స్ వంటి వ్యాధులు రావచ్చు.. అందుకని ఎప్పటికప్పుడు కిడ్నీలను శుభ్రం చేసుకుంటూ ఉండాలి..!! ఇందుకోసం డబ్బులు ఖర్చు చేయనవసరం లేదు.. మన ఇంట్లో లభించే వస్తువులతోనే చెక్ పెట్టవచ్చు.. అదెలాగంటే..!!
Kidneys: కొత్తిమీరతో ఇలా మీ కిడ్నీ లను శుభ్రపరుచుకోండి..!!
కిడ్నీలను శుభ్రపరిచి దానికి కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం కొత్తిమీర ని తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో ముందుగా తరిగి పెట్టుకొన్న కొత్తిమీర ను వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి ఈ నీటిని వడ పోసుకొవాలి. ఈ నీరు చల్లారాక అందులో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా తయారు చేసుకున్న కొత్తిమీర కషాయం ప్రతిరోజు మీకు నచ్చిన సమయంలో తాగవచ్చు. ఇలా చేయడం వలన కిడ్నీలు వాటంతటవే సుబ్ర పరచుకుంటాయి. కిడ్నీ లో పేరుకుపోయిన చెత్త మొత్తం తొలగిపోతుంది. కిడ్నీ లో ఉన్న రాళ్ళు మూత్రం ద్వారా బయటకు నెట్టి వేస్తుంది.
ఒకవేళ మీకు కొత్తిమీర అందుబాటులో లేకపోతే కరివేపాకు ఆకులతో కూడా పైన చెప్పుకున్న విధంగా కషాయం తయారు చేసుకొని తాగవచ్చు. ఇలా చేసినా కూడా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. వీటితో పాటు ప్రతి రోజు ఖచ్చితంగా ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. శరీరం శరీరానికి తగినంత నీరు అందితేనే కిడ్నీలు తమ పని తాము సక్రమంగా చేసుకో కలుగుతాయి. నీరు శాతం ఎక్కువగా ఉన్న పండ్లను, కూరగాయలను తీసుకోవాలి.
Kidneys: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి..!!
పుచ్చకాయలు 90 శాతం నీరు ఉంటుంది . వీటిని ఎక్కువగా తింటూ ఉండాలి. సొరకాయ, దోసకాయ లో కూడా మీరు శాతం అధికంగా ఉంటుంది. వీటిని కూడా మన డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తవు. అలాగే పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను మన ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలు , పాల పదార్థాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవాలి. పాలకూరను తింటుంటే కిడ్నీ లో ఉన్న రాళ్ళు కూడా కరుగుతాయి.