Corona cases: ఏపిలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండవ రోజు 20వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో 22,204 కొత్త కేసులు నమోదు కాగా 83 మంది కరోనాతో మృతి చెందారు. అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 2344 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానాల్లో అనంతపురం (2304), విశాఖపట్నం (2113) జిల్లాలు ఉన్నాయి,. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,70,588 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 11,128 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుండి డిశార్జ్ అయ్యారు. రికవరీ శాతం 50 మాత్రమే ఉండటం కొంత ఆందోళన కల్గిస్తుంది. 22వేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా కేవలం 11,128 మంది మాత్రమే 24 గంటల్లో చికిత్సతో కోలుకున్నారు.
మరణాల విషయానికి వస్తే 24 గంటల వ్యవధిలో విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 11 మంది మృతి చెందగా, విజయనగరం,అనంతపుం జిల్లాల్లో పది మంది చొప్పున, తూర్పు గోదావరి జిల్లాలో 9మంది, ప్రకాశం జిల్లాలో 8మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడుగురు, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలో అయిదుగురు చొప్పున, కృష్ణాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, కడపలో ఒకరు కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 12,03,337 మంది కరోనా బారిన పడగా 10, 24,375 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి 8,374 మంది మృత్యువాత పడ్డారు.