కరోనా వైరస్ పరీక్షలు ఎంత ఖరీదైనవో తెలిసిందే. దీంతో చాలామంది తమలో కొరోనా లక్షణాలు కనిపిస్తున్నా, పరీక్షలకు అయ్యే ఖర్చుల గురించి వెనకడుగు వేస్తున్నారు. అందుకే , త్వరలో ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే స్మార్ట్ ఫోన్ ద్వారా కరోనాను నిర్ధరణ చేసుకునే అవకాశం రాబోతోంది . ఇది నిజామా అని అనుకుంటున్నారా? ఇది చదవండి మీకే తెలుస్తుంది.
అమెరికాలోని ఉటా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. స్మార్ట్ ఫోన్తో కరోనా వైరస్ ఫలితాలను తెలుసుకోవడానికి వీలుగా ఓ సెన్సార్ పరికరాన్ని తయారు చేసారు . కరోనా వచ్చిందని అనుమానం ఉన్నవాళ్లు ,తమ లాలాజలాన్ని ఆ సెన్సార్పై పెట్టి స్మార్ట్ఫోన్కు అనుసంధిస్తే చాలు.. ఒక్క నిమిషంలో కోవిడ్-19 ఫలితం తెలుసుకోవచ్చు . ‘జికా వైరస్’ను గుర్తించడం కోసం సెన్సార్ పరికరాన్ని తయారుచేసిన పరిశోధకుల బృందమే దీన్ని తయారు చేశారు.సింగిల్ స్టాండ్ డీఎన్ఏ (ఆప్టమెర్స్) సాయంతో ఈ సెన్సార్ పనిచేస్తుంది. కోవిడ్-19లోని ప్రోటీన్లను సంగ్రహించడం ద్వారా వైరస్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది . ఇప్పుడు మీరు చేయవలిసిందల్లా ఈ సెన్సార్కు సంబంధించిన యాప్ను మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకుని, సెన్సార్ పరికరాన్ని మొబైల్కు అనుసంధానం చేస్తే చాలు. ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.
లాలాజలాన్ని సెన్సార్ పరికరం పై వేసినట్లయితే,దాన్ని సెన్సార్ స్కాన్ చేసి వెంటనే రిపోర్ట్ ను చెప్పేస్తుంది. అందులో ఉండే సున్నితమైన పరికరాలు డీఎన్ఏలోని వ్యత్యసాలను కనిపెడతాయి. కోవిడ్-19 ప్రోటీన్లు చాలా భిన్నంగా ఉంటాయి. ఫలితంగా సెన్సార్లు వాటిని వెంటనే గుర్తుపట్టడం వలన రిపోర్ట్స్ ని వెంటనే తెలియచేస్తుంది. అంతే కాదు ఈ సెన్సార్ను ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చు. ఈ సెన్సార్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనేది ఇంకా తెలియలేదు. కరోనా మరణాలు కొంతవరకైనా తగ్గాలి అంటే, ఇది కచ్చితంగా అందుబాటులోకి రావలిసి ఉంది . అప్పటి వరకు ప్రతి ఒక్కరు సురక్షితమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండవలిసిందే.