Corona: ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందనే వార్తల నేపథ్యంలో మరోవైపు కరోనా థర్డ్ వేవ్ కలకలం అనేకమందిని ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఇందులో పిల్లలపైనే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన చేసింది. కరోనా థర్డ్వేవ్ విషయాన్ని అంత సీరియస్ తీసుకోవద్దని చెబుతోంది.
Read More : Corona: డబ్బులు ప్రింట్ చేసుకుంటే సమస్యే ఉండదు… కరోనా సమయంలో భలే విశ్లేషణ
డబ్ల్యూహెచ్ఓ సూచన ఇది
డబ్ల్యూహెచ్ఓ వ్యాక్సిన్ ఎక్స్ పర్ట్ డాక్టర్ కాటే ఒబ్రెయిన్ పిల్లల్లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా లేదని విశ్లేషిస్తున్నారు. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి కూడా పిల్లల్లో రిస్క్ లెవల్ తక్కువ ఉందని, చనిపోయిన వారి సంఖ్య చాలా అరుదుగా ఉందన్నారు. ఈ కారణంగానే పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకోవటం లేదన్నారు. యూకే, యూఎస్, కెనడా లాంటి దేశాలు కూడా తమ దేశంలో పెద్ద వయసు వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే మిగతా దేశాలకు వ్యాక్సిన్ ను అందజేయాలని ఆయన కోరారు. పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం పెద్దగా లేదని అన్నారు.
Read More: Corona: వాట్సాప్ తో కరోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవచ్చంటే…
బ్రిటన్ లో త్వరలోనే పిల్లలకు కరోనా వ్యాక్సిన్
ఇదిలాఉండగా, బ్రిటన్ ప్రభుత్వం 12 నుంచి 15 ఏళ్ల లోపు చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. త్వరలోనే వ్యాక్సినేషన్ కు అనుమతి ఇవ్వనుంది. పైజర్ తో పాటు బయో ఎన్ టెక్ టీకాను ఇప్పటికే పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ చేశారు. సక్సెస్ ఫుల్ గా ట్రయల్స్ జరిగాయని..వ్యాక్సిన్ సేఫ్ అని తమ పరీక్షలో తేలిందని బ్రిటన్ కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ ఎ) తెలిపింది. ” 12 నుంచి 15 సంవత్సరాల పిల్లల్లో క్లినికల్ ట్రయల్ డేటాను సమీక్షించాం. ఫైజర్, బయోఎన్ టెక్ సురక్షితమైన, ప్రభావతమైందని గుర్తించాం. ఈ టీకాలు పిల్లల్లో కరోనా ప్రమాదాన్ని నివారిస్తుందని గుర్తించాం ” అని ఎంహెచ్ ఆర్ఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూన్ రైన్ అన్నారు. దీంతో వాక్సినేషన్ కు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు.