కరోనా వైరస్ మహమ్మారి భారతదేశాన్ని ఎంతలా వణికిస్తోందో అందరం చూస్తూనే ఉన్నాం. గత కొద్ది నెలలుగా ప్రజలంతా వ్యాక్సిన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. మొట్టమొదటిసారి వ్యాక్సిన్ టాపిక్ వచ్చినప్పుడు ఆగస్టు 15వ తేదీకి వచ్చేస్తుంది అన్న వార్తలు బయటకు రాగా ఐసీఎంఆర్ దానిని కొట్టివేసింది. అధికారికంగా వచ్చే సంవత్సరమే వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు.
ఇక ఇదే క్రమంలో సంస్థలు అన్నీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో పూర్తిస్థాయి వ్యాక్సిన్ ను విడుదల చేసి ఆ ఘనత సాధించాలని ఇక కోట్లకు కోట్ల లాభాలు గడించాలని చూస్తున్నాయి. కొన్ని దేశాలు అయితే అత్యుత్సాహంతో ముందే ఆర్డర్లు పెట్టేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ భారతదేశంలోని వ్యాక్సిన్ తయారీ సంస్థలకు వాటి అనుబంధ సంస్థలకు షాక్ ఇస్తోంది. ప్రస్తుతం ప్రజలు ఎవరూ వైరస్ గురించి పట్టించుకోవడం లేదు. కేంద్రం కూడా అన్ లాక్ ప్రక్రియను జోరుగా కొనసాగిస్తోంది. కొద్ది రోజుల్లో థియేటర్లు కూడా తరచుకోనున్నాయి. విద్యాసంస్థలు కూడా వచ్చే నెల నుండి దాదాపుగా మొదలై పోయినట్లే. అంతేకాకుండా వైరస్ వ్యాప్తి కూడా క్షీణిస్తోందని పరిశోధనలు బయటకు వస్తున్నాయి.
ఇప్పుడు దాదాపు 80 శాతం మంది ఈ వైరస్ సోకిన తర్వాత ఆసుపత్రులకు వెళ్లడం లేదు. వారిలో అత్యధిక శాతం మందికి వైరస్ వచ్చి వెళ్లిపోయినా కూడా ఆ లక్షణాలే తెలియడం లేదు. ఇలాంటి వారి వల్ల వృద్ధులకు, అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి రిస్కు కానీ ప్రస్తుతానికైతే వైరస్ కూడా మానవ శరీరంలో ప్రభావం అంతగా చూపించడం లేదట. వైరస్ సోకిన తర్వాత చాలామంది లైట్ తీసుకుంటున్నారు. కొద్ది రోజులకి ఇదంతా ముగిసిపోతుంది అని బలంగా ఫిక్స్ అయిపోయారు. అలాగే కేసులు కూడా బయట పడడం మానేశాయి. టెస్టులు చేస్తున్నారు కానీ ఈ వైరస్ సోకిన వారు ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తగ్గిన తర్వాత బయటకు వస్తున్నారు.
ఇప్పుడు వ్యాక్సిన్ ఎవరికోసం చేయాలి అన్నట్లు పరిస్థితి తయారైంది. అయితే ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న వారు…. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ పైన ఆధారపడి ఉన్నారు కానీ అంతకు ముందు అవసరమైనన్ని డోస్ లు ఇప్పుడు అవసరం పడకపోవచ్చు. ఇక యాంటీబాడీలు కూడా వచ్చేస్తున్నాయి. ప్లాస్మా ఇచ్చేందుకు అందరూ రెడీ అయిపోయారు. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ తయారి సంస్థలకు ఇదంతా షాక్ అనే చెప్పాలి.