ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి అందరికి తెలిసిందే. కరోనా వైరస్ కొన్ని లక్షణాలతో మొదలవుతుందని, దాని దశ మారేసరికి దాని తీవ్రత ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం వాతావరణం బట్టి జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇక కరోనా మొదటి లక్షణం గొంతునొప్పి అవ్వడంతో ఇప్పుడు ఇతర కారణాల వల్ల గొంతు నొప్పి సమస్య రాగానే చాలామంది కరోనా అని భయపడుతున్నారు. నిజానికి గొంతు నొప్పి వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
ప్రస్తుతం చాలామంది చిన్న చిన్న సమస్యల వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటివి రాగానే ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఇది ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. సాధారణంగా వచ్చే గొంతునొప్పికి, కరోనా వల్ల వచ్చే గొంతునొప్పికి పెద్దగా తేడా లేకున్నా ఏది కరోనా వల్ల వచ్చే గొంతు నొప్పి అని గుర్తించుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవి చూద్దాం.
సాధారణ గొంతునొప్పికి ఎలాంటి వాపు లాంటివి ఉండవు. కానీ జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా వచ్చే అవకాశం ఉంది. కాగా కరోనా వల్ల వచ్చే గొంతు నొప్పికు వాపు, తీవ్రమైన గొంతు మంట ఉంటుంది. ఒకవేళ మీరు ఎలాంటి హాని కలిగించే వాతావరణంలో లేకున్నా అనుకోకుండా తీవ్రమైన జ్వరం,జలుబు, గొంతులో మంట, వాపు వంటి సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు.
అనుకోకుండా ఇతరులకు కరోనా ఉండి ఉంటే అది మీకు వచ్చిందని అనుమానం అనిపిస్తే తప్పక కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలి. మీకు ముందుగానే ఇలాంటి అనుమానాలు ఉంటే కొన్ని జాగ్రత్తలు పాటించండి. కూల్ డ్రింక్స్ ,చల్లని నీటిని తీసుకోవద్దు. వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలి. మీరు తినే ఆహార పదార్థాలలో ఎక్కువ పోషకాలు ఉండేటట్లు చూసుకోండి.
రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోండి. దగ్గు, జలుబు వంటివి ఉంటే వేడి నీళ్లలో కాస్త పసుపు వేసి ఆవిరి పట్టండి. వేడి నీళ్ళలో పసుపుని వేసి పుకలించండి, కొన్ని తాగండి. ఇతరులకు దూరంగా ఉండండి. మీకు అనుమానం మరీ ఎక్కువగా ఉంటే తప్పక కొవిడ్-19 పరీక్షలు చేయించుకోండి.