కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ దేశాలను దారుణంగా వణికిస్తోంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ అగ్ర రాజ్యాన్ని సైతం వణికించింది. ఇక ఈ కరోనా వైరస్ బారిన ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 64 లక్షలమంది పడ్డారు. ఇక అందులో దాదాపు 10 లక్షలమంది కరోనా వైరస్ కు బలయ్యారు.
అయితే ఈ కరోనా వైరస్ గురించి రోజుకో షాకింగ్ విషయం వెలుగులకి వస్తున్నాయ్. రోజుకో కొత్త లక్షణం బయటపడింది. మొదట కేవలం జలుబు, దగ్గు, గొంతు నొప్పి మాత్రమే కరోనా లక్షణాలు అని తెలగా ఆతర్వాత కరోనా వైరస్ లక్షణాల్లో వాసనా తెలియకపోవడం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, నోటి పుండ్లు చేరాయ్.
అయితే ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ తెలిసింది. అది ఏంటి అంటే.. జలుబు నుంచి కరోనా వైరస్ సోకినా వారిలో కోవిడ్-19 మహమ్మారి తీవ్రత తక్కువ ఉంటుందని సమాచారం. ఈ మేరకు తమ పరిశోధనల్లో తేలిందని అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. 2015 మర్చి 18 నుంచి ఈ సంవత్సరం మర్చి 11 వరకు రెస్పిరేటరీ ప్యానెల్ పరీక్షలు చేయించుకున్న వారు, ఈ ఏడాది మార్చి 12 నుంచి జూన్ 12 మధ్యలో కొవిడ్ పరీక్షలు చేయించుకున్న వారి వివరాల మేరకు అధ్యయనం చెయ్యగా ఈ విషయం బయట పడినట్టు వారు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఆ అధ్యనానం ప్రకారం కరోనా వైరస్ దాడి కాస్త తక్కువగా ఉంటుందని కోవిడ్ వచ్చిన బతికేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు స్పష్టం చేశారు. అంతేకాదు పరిశోధన ప్రకారం కరోనా వైరస్ బారిన పడినప్పటికీ అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది జయించడం వెనుక ఉన్న అసలు కారణం ఇదే అని జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అనే పత్రికలో ప్రచురించారు.