కరోనా వైరస్ కు శాశ్వతమైన నివారణ వ్యాక్సిన్ ద్వారానే అని అందరికి తెలిసిందే. అయితే ఈ మహమ్మారి ఉధృతి ప్రపంచంలో ప్రారంభమైనప్పటి నుండి లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. కానీ అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ మంది ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ తెలిసిన ఓ చిన్న చిట్కా ఈ వైరస్ ను అంతం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆయుర్వేదం కావచ్చు.. చిన్న చిన్న చిట్కాలే కదా అని తీసి పారేసే ఎన్నో పెద్ద పెద్ద వ్యాధులను దూరం చేస్తాయన్నది వైద్యుల మాట. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు రష్యా శాస్తవేత్తలు చెబుతున్న ఉపాయం వింటే మీరే ఆశ్చర్యపోతారు.
మన దేశంలో ఎంతో కాలంగా జరుగుతున్నదే. గోరువెచ్చని నీటిని ఫార్ములా దీనిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి చాలా గొప్పదని వివరించారు. రష్యా సైంటిస్టులు రష్యాకు చెందిన సైబీరియా లోని నోవోసిబిర్ల్క్స్ స్టేట్ యూనివర్సిటీలోని రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ ఈ విషయాన్ని కనుగొంది.
ఈ ఇన్స్టిట్యూట్ కు చెందిన పరిశోధనా బృందం సాధారణ ఉష్ణోగ్రత లేదా గోరువెచ్చని నీరు తాగితే వైరస్ అవకాశాలు చాలా తక్కువ అవుతాయని తేల్చిచెప్పింది. గది ఉష్ణోగ్రత కలిగిన నీరు కరోనాకు కారణమవుతున్న సార్స్ సీఓవి-2 వైరస్ పెరుగుదలను ఆపుతుందని గుర్తించారు ఈ సైంటిస్టులు. రూమ్ టెంపరేచర్ కలిగిన నీరు 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్ కణాల్ని 90 శాతం చంపేస్తుందని.
ఇక ఈ వైరస్ జీవితకాలం అనేది నీటి ఉష్ణోగ్రత పై ఆధారపడి ఉంటుందని.. మరుగుతున్న నీటిలో అయితే వైరస్ పూర్తిగా చనిపోతుందని డబ్భై రెండు గంటల్లోనే దాదాపు అన్ని సెల్స్ ను నాశనం చేయవచ్చు అని చెప్పారు. ఈ విధంగా వైరస్ ఏ మాత్రం తన సంతతిని పెంచుకోలేదని తేల్చేశారు.