ఈ మధ్యకాలంలో ప్రజలకు ఓపిక చాలా తక్కువ అయింది. చాలామంది గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంటారు. తోటి వారిపై చీటికిమాటికి విరుచుకుపడుతున్నారు. సరిగ్గా చెప్పాలంటే ఇతరులపై నోరేసుకొని పడిపోయే వారి సంఖ్య ఎక్కువైపోయింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం ఇవన్నీ కట్టిపెట్టాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరుణ వ్యాప్తిని నెమ్మదిగా అరికట్టాలంటే ఇది తప్పనిసరి.
గట్టిగా మాటలు రావడం వల్ల మన నోటి లో నుండి వైరస్ వ్యాపిస్తుంది అని.. దానితో దగ్గర్లోని వారందరికీ కరోనా వస్తుందని అంటున్నారు. అందువల్ల నెమ్మదిగా మాట్లాడితే కొంత మేరకు ఆ వ్యాప్తిని తగ్గించుకోవచ్చని కాలిఫోర్నియా యూనివర్శిటీ సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఇక మరింత జాగ్రత్త కోసం ఇంట్లోకి గాలి వెలుతురు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా గదిలోని గాలి బయటికి వెళ్ళే ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు తాజాగాలి ఇంట్లోకి వచ్చేలా జాగ్రత్త పడాలి.
ఇంట్లో ఉన్న వారు కూడా అవసరమైనంత సేపు మాట్లాడి వీలైనంత నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరికోసమైనా ఆసుపత్రికి వెళితే అక్కడ గంటలు గంటలు వేచి చూడకుండా వెంటనే వచ్చేయాలి. వీలైనంత వరకూ ఇంటి భోజనం చేయడం ఉత్తమం.
మాట్లాడేటప్పుడు మన నోట్లో నుండి వచ్చే తుంపరులు వెంటనే ఆవిరైపోతాయి. అయితే వాటిలో నుండి ఏరోసోల్ కణాలు విడుదలవుతాయి. ఈ కణాల్లోని వైరస్ కారకాలను ఉంటాయి. చిన్నగా మాట్లాడితే 35 డెసిబల్స్ శబ్దం మాత్రమే వస్తుంది. అందువల్ల వైరస్ వ్యాప్తి కి అవకాశం చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది. ఇక ఓ మోస్తరుగా రద్దీ ఉన్న ప్రదేశాల అయినాలో గట్టిగా మాట్లాడే వారు మరింత ప్రమాదకారులు.